జర్మనీలో కూలిన విమానం.. ముగ్గురి మృతి..?
జర్మనీలో ఘోర ప్రమాదం జరగింది. ప్రయాణికులతో వెళ్తున్న చిన్న విమానం కుప్పకూలింది. స్టుట్గార్ట్ విమానాశ్రయం నుంచి శనివారం ఉదయం బయల్దేరిన పైపర్ ఎయిర్క్రాప్ట్కు చెందిన విమానం ప్రమాదవశాత్తు స్టైనెన్బ్రాన్ ప్రాంతంలో కూలిపోయింది. దీంతో సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది.. ప్రమాద స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికితీస్తున్నారు.
విమాన ప్రమాదంలో ఎంత మంది ప్రయాణికులు ఉన్నారనే దానిపై ఇంకా స్పష్టత లేదు. ప్రమాదం జరగడానికి గల కారణం కూడా ఇంకా తెలియరాలేదు. ప్రమాదంలో పదుల సంఖ్యలో ప్రయాణికులు చనిపోయి ఉంటారని పోలీసులు తెలిపారు. కడపటి సమాచారం అందేవరకు ముగ్గురు చనిపోయారని తెలుస్తోంది. టేకాఫ్ అయిన వెంటనే విమానం ప్రమాదానికి గురయ్యిందని తెలుస్తోంది.
ప్రమాదం జరిగిన స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్లైట్ రికార్డర్ స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.