సౌత్కరోలినాలో చర్చిలో కాల్పులు: 8మంది మృతి
న్యూయార్క్: అమెరికాలో దుండగులు మరోసారి తెగబడ్డారు. సౌత్కరోలినా చర్చిలో దుండగులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఎనిమిది మృతి చెందారు. మరికొంతమందికి గాయాలయ్యాయి.
మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చర్చిలో ప్రార్థనలు చేస్తున్న సమయంలో దుండగులు ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు సమాచారం. ఈ ఘటన బుధవారం జరిగినట్లు గురువారం అక్కడి పోలీసులు వెల్లడించారు.

ఈ ఘటన చాలా దురదృష్టకరమని చర్చి పాస్టర్ థామస్ డిక్సన్ అన్నారు. మృతులకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
కాగా, 20ఏళ్ల వయస్సున్న యువకులే ఈ దాడికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గ్రే స్వేట్ షార్ట్, బ్లూ జీన్స్, బూట్లు ధరించారని చెప్పారు. కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications