అరబ్ లో మసాలాల మధ్యలో డ్రగ్స్ సరఫరా
అరబ్: మాదక ద్రవ్యాలు (డ్రగ్స్) అక్రమంగా రవాణా చేస్తున్న ముఠా సభ్యులను అరబ్ లోని అబుధబి పోలీసులు అరెస్టు చేశారు. మసాలా దినుసుల మధ్యలో డ్రగ్స్ పెట్టి గుట్టుచప్పుడు కాకుండా వ్యాపారం చేస్తున్నారని పోలీసు అధికారులు తెలిపారు. అరెస్టు అయిన వారిలో మహిళలు ఉన్నారు.
అబుధబి సీఐడీ డైరెక్టర్ డాక్టర్ రషీద్ మొహమ్మద్ కథనం మేరకు వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మసలా దినుసులు తరలిస్తున్న 8 మంది అనుమానాస్పదంగా తిరుగుతుంటే వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి దగ్గర ఉన్న398 సంచులు స్వాధీనం చేసుకుని క్షుణ్ణంగా పరిశీలించారు.

అందులో డ్రగ్స్ ఉన్న విషయం గుర్తించి అందరిని అదుపులోకి తీసుకున్నారు. తాము మసాలా దినుసుల మధ్యలో డ్రగ్స్ సరఫరా చేస్తున్నామని నిందితులు అంగీకరించారు. వీరిలో కొందరికి మసాలా దినుసులు సరఫరా చేసే వ్యాపారాలు ఉన్నాయని, కొందరితో కలిసి డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని విచారణలో వెలుగు చూసింది.
మొత్తం ముగ్గురు విదేశీ మహిళలతో పాటు 8 మందిని అరెస్టు చేసి రూ. లక్షల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నామని సీఐడీ డైరెక్టర్ డాక్టర్ రషీద్ మొహమ్మద్ అన్నారు. వీరు ఎక్కడి నుంచి డ్రగ్స్ తీసుకు వచ్చారు ? ఈ ముఠా వెనుక ఎవరెవరు ఉన్నారు అని ఆరా తీస్తున్నామని డాక్టర్ రషీద్ మొహమ్మద్ స్థానిక మీడియాకు చెప్పారు.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications