అప్ఘనిస్ధాన్లో బ్రిటీష్ ఎంబసీ కాన్వాయ్పై ఆత్మాహుతి దాడి... 5గురు మృతి, 34 మందికి గాయాలు
న్యూఢిల్లీ: ఆప్ఘనిస్ధాన్ రాజధాని కాబూల్లో గురువారం నాడు బ్రిటిషన్ ఎంబసీ వాహనాల కాన్వాయ్పై మోటారు సైకిల్ ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో ఐదుగురు చనిపోగా... 34 మంది వరకు గాయపడ్డారుని పోలీసులు తెలిపారు.
గాయపడిన వారిని సమీపంలో ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు. చనిపోయిన వారిలో ఇద్దరు విదేశీయలు ఉన్నారని.. ఒకరు మాత్రం బ్రిటిన్ జాతీయుడిగా గుర్తించినట్లు సమాచారం. కాబుల్లో బ్రిటీష్ ఎంబసీ వాహనాన్ని లక్ష్యంగా చేసుకొని ఆత్మాహుతి దాడి జరిగిందని వివరించారు.

వాహనం లోపల దౌత్యవేత్తలెవరూ లేరని రాయబార కార్యాలయ ప్రతినిధి ఒకరు చెప్పారు. ఈ ఆత్మాహుతి దాడిలో 34 మంది ఆఫ్ఘాన్ ప్రజలు, మూడు కార్ల నాశనం అయినట్లుగా హోం శాఖ అధికార ప్రతినిధి పేర్కొన్నారు.
కారులో వేగంగా వచ్చిన ఆత్మాహుతి దళ సభ్యుడు కాన్వాయ్ మధ్యకు తన వాహనాన్ని తెచ్చి తనను తాను పేల్చుకున్నాడని తెలిపారు. కాగా, ఈ దాడికి పాల్పడింది తామేనని తాలిబాన్ వర్గాలు ప్రకటన చేశాయి.
#Kabul blast updates: Suicide bomber targeted a British Embassy vehicle, eye witnesses to TOLOnews:4 civilians killed pic.twitter.com/xld3zBEVUz
— Muslim Shirzad (@MuslimShirzad) November 27, 2014 











Click it and Unblock the Notifications