సిడ్నీలో బాంబులు పెట్టామని..., తప్పించుకొచ్చిన మహిళ(పిక్చర్స్)
సిడ్నీ: ఆస్ట్రేలియా నగరం సిడ్నీలో గల మార్టిన్ ప్లెన్లోని లాండ్ట్ చాకోలేట్ కేఫ్లో ఇస్లామిక్ రాజ్య గన్మెన్ సోమవారం ఉదయం కొందరు సాధారణ పౌరులను నిర్బంధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో న్యూ సౌత్ వేల్స్ పోలీసులు కేఫ్ను చుట్టుముట్టారు. పోలీసులు ఆ కేఫ్ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. బంధీల్లో 12 నుండి అంతకంటే ఎక్కువ మంది వరకు ఉండవచ్చుననే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో సిడ్నీలోని భారత రాయబార కార్యాలయం మూసివేశారు. కాన్సులేట్ సిబ్బందిని అక్కడి నుండి సురక్షఇత ప్రాంతానికి తరలించినట్లు సిడ్నీలోని డిప్యూటీ కన్సల్ జనరల్ వినోద్ బాహాదే తెలిపారు. కేఫ్లో ఇస్లామిక్ రాజ్య గన్మెన్ ఐఎస్ జెండాను ఉంచారు. అరబిక్ అక్షరాలలో రాశారు. అగంతకుల నుండి ఐదుగురు బంధీలు తప్పించుకున్నారు. కేఫ్ను భద్రతా దళాలు చుట్టుముట్టాయి.
కేఫ్ పరిసర ప్రాంతాలను అధికారులు ఖాళీ చేయించారు. సిడ్నీలోని ఒపేరా హౌస్, అమెరికా రాయబార కార్యాలయం మూసివేశారు. మార్టిన్ ప్లేస్లోని బ్యాంకులు, ఇతర కార్యాలయాలను మూసివేశారు. సిడ్నీ నగరం పైన ఏ విమానాలు తిరగకుండా చర్యలు తీసుకున్నారు. కాగా, సిడ్నీ నగరంలో నాలుగు బాంబులు పెట్టామని అగంతకులు బెదిరిస్తున్నారని తెలుస్తోంది.
కాగా, భారత్కు చెందిన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవాల్ భారత్ క్రికెటర్ల భద్రత పైన మానిటరింగ్ చేస్తున్నారు.
ఇదిలా ఉండగా, సిడ్నీ సీజ్ను టెర్రర్ అటాక్గా భావిస్తున్నట్లు న్యూ సౌత్ వేల్స్ పోలీసులు చెప్పారు. అగంతకుల నుండి తప్పించుకున్న ఒకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లుగా తెలుస్తోంది.

తప్పించుకొని వచ్చిన మహిళ భద్రతా సిబ్బంది వద్దకు...
ఆస్ట్రేలియా నగరం సిడ్నీలో గల మార్టిన్ ప్లెన్లోని లాండ్ట్ చాకోలేట్ కేఫ్లో ఇస్లామిక్ రాజ్య గన్మెన్ సోమవారం ఉదయం కొందరు సాధారణ పౌరులను నిర్బంధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో న్యూ సౌత్ వేల్స్ పోలీసులు కేఫ్ను చుట్టుముట్టారు. పోలీసులు ఆ కేఫ్ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. బంధీల్లో 12 నుండి అంతకంటే ఎక్కువ మంది వరకు ఉండవచ్చుననే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.

కిటికీ నుండి చూస్తున్న బంధీలు
ఈ నేపథ్యంలో సిడ్నీలోని భారత రాయబార కార్యాలయం మూసివేశారు. కాన్సులేట్ సిబ్బందిని అక్కడి నుండి సురక్షఇత ప్రాంతానికి తరలించినట్లు సిడ్నీలోని డిప్యూటీ కన్సల్ జనరల్ వినోద్ బాహాదే తెలిపారు. కేఫ్లో ఇస్లామిక్ రాజ్య గన్మెన్ ఐఎస్ జెండాను ఉంచారు. అరబిక్ అక్షరాలలో రాశారు. అగంతకుల నుండి ఐదుగురు బంధీలు తప్పించుకున్నారు. కేఫ్ను భద్రతా దళాలు చుట్టుముట్టాయి.

భద్రతా సిబ్బంది
కేఫ్ పరిసర ప్రాంతాలను అధికారులు ఖాళీ చేయించారు. సిడ్నీలోని ఒపేరా హౌస్, అమెరికా రాయబార కార్యాలయం మూసివేశారు. మార్టిన్ ప్లేస్లోని బ్యాంకులు, ఇతర కార్యాలయాలను మూసివేశారు. సిడ్నీ నగరం పైన ఏ విమానాలు తిరగకుండా చర్యలు తీసుకున్నారు.

భద్రతా సిబ్బంది
కాగా, భారత్కు చెందిన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవాల్ భారత్ క్రికెటర్ల భద్రత పైన మానిటరింగ్ చేస్తున్నారు.
ఇదిలా ఉండగా, సిడ్నీ సీజ్ను టెర్రర్ అటాక్గా భావిస్తున్నట్లు న్యూ సౌత్ వేల్స్ పోలీసులు చెప్పారు. అగంతకుల నుండి తప్పించుకున్న ఒకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications