సిరియాలో ఆత్మాహుతి దాడి.. పేలిన కారు బాంబు, 39 మంది మృతి
సిరియాలోని అలెప్పో నగర శివారులో శనివారం జరిగిన బాంబు పేలుడు 39 మంది మృత్యువాత పడగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.
డమాస్కస్: సిరియా మరోసారి బాంబు పేలుడుతో దద్దరిల్లింది. శనివారం అలెప్పో నగర శివారులో జరిగిన ఈ పేలుడులో 39 మంది మృత్యువాత పడగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. దీన్ని ఆత్మాహుతి దాడిగా సిరియా ప్రభుత్వం అనుమానిస్తోంది.
అలెప్పోకు వెళ్తున్న ఓ బస్సును నగర శివారులో ఆపి ఉంచిన సమయంలో.. దానికి సమీపంలో ఆత్మాహుతి దళ సభ్యుడు కారు బాంబును పేల్చినట్టు పోలీసులు భావిస్తున్నారు. పేలుడు ధాటికి ఓ బస్సు, ఇతర వాహనాలు ధ్వంసమయ్యాయి.

ఈ పేలుడులో ప్రయాణికుల మృతదేహాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ఈ దాడికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
More From
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications