ఘోర పడవ ప్రమాదం: 131మంది మృతి, 150మందికిపైగా గల్లంతు
టాంజానియా: ఆఫ్రికా దేశం టాంజానియాలో ఘోర పడవ ప్రమాదం చోటు చేసుకుంది. పడవ బోల్తా పడిన ఘటనలో 131 మంది ప్రాణాలు కోల్పోగా.. 150మందికి పైగా గల్లంతయ్యారు.
లేక్ విక్టోరియాలో ప్రయాణిస్తున్న పడవ కొద్దిసేపట్లో రేవుకు చేరుకుంటుందనగా ప్రమాదవశాత్తు బోల్తాపడింది. ప్రమాదం జరిగిన సమయంలో పడవలో 400 మంది ప్రయాణికులున్నట్లు సమాచారం.

ఈ ప్రమాదం నుంచి 37 మంది ప్రాణాలతో బయటపడ్డారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతోన్నాయి. పడవ సామర్థ్యం వంద సీట్లు కాగా.. అందులో 400 మంది ప్రయాణికులు ఎక్కినట్లు తెలుస్తోంది.
పడవ సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. పడవ రేవు సమీపానికి చేరుతుందనగానే ప్రయాణికులంతా ఒకవైపునకు వచ్చారు. దీంతో పడవ ఒకవైపునకు ఒరిగిపోయి బోల్తా పడి నెమ్మదిగా మునిగిపోయిందని అధికారులు అంచనా వేస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications