Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కిర్గిజిస్తాన్ లో ఏపీ విద్యార్థులపై దాడులు-టీడీపీ నేతలు రామ్మోహన్, భరత్ భరోసా-సేఫ్టీపై ఆందోళన..!

ఏపీ నుంచి మధ్య ఆసియా దేశం కిర్గిజిస్తాన్ వెళ్లి చదువుకుంటున్న పలువురు విద్యార్ధులకు తాజాగా చోటు చేసుకున్న ఓ ఘటన, అనంతరం చోటు చేసుకుంటున్న పరిణామాలు చుక్కలు చూపిస్తున్నాయి. మే 13న స్థానికంగా ఉన్న ఓ హాస్టల్ లో జరిగిన ఈ ఘటన తర్వాత స్థానిక విద్యార్ధులు వర్సెస్ విదేశీ విద్యార్ధులుగా పరిస్ధితి మారిపోయింది. దీంతో హాస్టళ్ల గొడవలు కాస్తా రోడ్లపైకి వచ్చేశాయి. ఈ నేపథ్యంలో ఏపీ టీడీపీ యువ నేతలు రామ్మోహన్ నాయుడు, శ్రి భరత్ వారితో మాట్లాడి భరోసా ఇచ్చారు.

కిర్గిజిస్తాన్ లో చిక్కుకుపోయిన ఏపీకి చెందిన పలువురు విద్యార్ధులతో రామ్మోహన్ నాయుడు, శ్రీభరత్ వీడియో కాల్ లో మాట్లాడారు. అక్కడి పరిస్ధితుల్ని అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే ఈ వ్యవహారంపై విదేశాంగశాఖ మంత్రి జై శంకర్ తో పాటు విదేశాంగ కార్యదర్శికి కూడా ఫిర్యాదు చేశామని, వారు ఎంబసీతో మాట్లాడుతున్నారని తెలిపారు. సమస్య త్వరలోనే పరిష్కారమవుతుందని విద్యార్ధులకు హామీ ఇచ్చారు.

tdp leaders rammohan naidu matukumilli bharat contact ap students stranded in Kyrgyzstan hostels

టీడీపీ నేతలతో వీడియో కాల్ లో మాట్లాడిన ఏపీ విద్యార్దులు.. స్ధానికంగా ఉంటున్న కొందరు ఈ మధ్యే రాడ్లతో వచ్చి తమను భయబ్రాంతుల్ని చేశారని పేర్కొన్నారు. ఆర్ధికంగా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారన్నారు. ఉద్యోగాల విషయంలోనూ ఇబ్బందులు పెడుతున్నారని, అంతిమంగా తమను కిర్జిజిస్తాన్ నుంచి పంపించేందుకు ప్రయత్నిస్తున్నారని బాధితులు ఆరోపించారు. అక్కడ హాస్టళ్లలో నెలకున్న తాజా పరిస్ధితుల్ని టీడీపీ నేతలకు విద్యార్ధులు వివరించారు. దీంతో సురక్షితంగా ఉండేందుకు ప్రయత్నించాలని వీరు సూచించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+