కిర్గిజిస్తాన్ లో ఏపీ విద్యార్థులపై దాడులు-టీడీపీ నేతలు రామ్మోహన్, భరత్ భరోసా-సేఫ్టీపై ఆందోళన..!
ఏపీ నుంచి మధ్య ఆసియా దేశం కిర్గిజిస్తాన్ వెళ్లి చదువుకుంటున్న పలువురు విద్యార్ధులకు తాజాగా చోటు చేసుకున్న ఓ ఘటన, అనంతరం చోటు చేసుకుంటున్న పరిణామాలు చుక్కలు చూపిస్తున్నాయి. మే 13న స్థానికంగా ఉన్న ఓ హాస్టల్ లో జరిగిన ఈ ఘటన తర్వాత స్థానిక విద్యార్ధులు వర్సెస్ విదేశీ విద్యార్ధులుగా పరిస్ధితి మారిపోయింది. దీంతో హాస్టళ్ల గొడవలు కాస్తా రోడ్లపైకి వచ్చేశాయి. ఈ నేపథ్యంలో ఏపీ టీడీపీ యువ నేతలు రామ్మోహన్ నాయుడు, శ్రి భరత్ వారితో మాట్లాడి భరోసా ఇచ్చారు.
కిర్గిజిస్తాన్ లో చిక్కుకుపోయిన ఏపీకి చెందిన పలువురు విద్యార్ధులతో రామ్మోహన్ నాయుడు, శ్రీభరత్ వీడియో కాల్ లో మాట్లాడారు. అక్కడి పరిస్ధితుల్ని అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే ఈ వ్యవహారంపై విదేశాంగశాఖ మంత్రి జై శంకర్ తో పాటు విదేశాంగ కార్యదర్శికి కూడా ఫిర్యాదు చేశామని, వారు ఎంబసీతో మాట్లాడుతున్నారని తెలిపారు. సమస్య త్వరలోనే పరిష్కారమవుతుందని విద్యార్ధులకు హామీ ఇచ్చారు.

టీడీపీ నేతలతో వీడియో కాల్ లో మాట్లాడిన ఏపీ విద్యార్దులు.. స్ధానికంగా ఉంటున్న కొందరు ఈ మధ్యే రాడ్లతో వచ్చి తమను భయబ్రాంతుల్ని చేశారని పేర్కొన్నారు. ఆర్ధికంగా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారన్నారు. ఉద్యోగాల విషయంలోనూ ఇబ్బందులు పెడుతున్నారని, అంతిమంగా తమను కిర్జిజిస్తాన్ నుంచి పంపించేందుకు ప్రయత్నిస్తున్నారని బాధితులు ఆరోపించారు. అక్కడ హాస్టళ్లలో నెలకున్న తాజా పరిస్ధితుల్ని టీడీపీ నేతలకు విద్యార్ధులు వివరించారు. దీంతో సురక్షితంగా ఉండేందుకు ప్రయత్నించాలని వీరు సూచించారు.
Telugu students say scary situation prevailing in Kyrgyzstan following attacks on foreign students by the locals
— 🚲 𝓓𝓲𝓵𝓮𝓮𝓹 🚲 (@dmuppavarapu) May 20, 2024
TDP Srikakulam MP Rammohan Naidu and TDP vizag MP candidate M Bharat speaking to medical students form AP over video conference call in Kyrgyzstan pic.twitter.com/l5WbG1QcCz
-
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
IT ఉద్యోగులకు గుడ్ న్యూస్. లేఆఫ్స్ లేవు.. కంపెనీ కీలక ప్రకటన! -
BCCI కు ఆ లక్కీ ఛాంప్ ఎలా దొరికింది? ప్రార్థన చేసి.. ప్రపంచ కప్ గెలిచి.. -
పాకిస్తాన్ కు ఐసీసీ భారీ నగదు బహుమతి! ఎన్ని కోట్లంటే..! -
భారత్ గెలిస్తే ఏంటట: పాకిస్తానోళ్లు కడుపు మంటతో పోయేట్టున్నారయ్యో -
పాకిస్థాన్ ఖేల్ ఖతం.. లీటర్ పెట్రోల్ రూ. 321, డీజిల్ రూ. 335.. -
T20 World Cup Final: నోర్మూయిస్తాం..! చాలా చూశాం..! ఫైనల్ వేళ శాంట్నర్ వర్సెస్ సూర్య..! -
మనం మనం బరంపురం.. !! -
India Post GDS Result 2026: పోస్టాఫీస్ జాబ్స్ మెరిట్ లిస్ట్ విడుదల-ఇలా చెక్ చేసుకోండి..! -
బరువు తగ్గాలంటే చనా వెజ్ సలాడ్ ఇలా ట్రై చెయ్యండి! -
టీమిండియాకు టీ20 కెప్టెన్ షాక్? రిటైర్మెంట్ వార్తలు నిజమేనా? -
Adani Total Gas: గృహ వినియోగదారులకు ఊరట.. పరిశ్రమలకు గ్యాస్ సరఫరా తగ్గింపు












Click it and Unblock the Notifications