Tesla : త్వరలో భారత్ లోకి టెస్లా ఎంట్రీ- ఎలాన్ మస్క్ ప్రకటన- మోడీతో ఫలించిన చర్చలు..
భారత్ లో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అంతర్జాతీయ బ్రాండ్ టెస్లా ఎంట్రీకి ముహుర్తం ఖరారైంది. ఈ ఏడాదే భారత్ లోకి టెస్లా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ విషయాన్ని టెస్లా సీఈవో, ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ ఇవాళ ప్రకటించారు. ప్రధాని మోడీతో యూఎస్ లోని న్యూయార్క్ లో భేటీ అయిన మస్క్.. అనంతరం ఈ ప్రకటన చేశారు. దీంతో భారత్ లో టెస్లా కోసం ఎదురుచూపులు ఫలించినట్లయింది.
ప్రధాని మోడీ యూఎస్ లో తన మూడు రోజుల పర్యటన ప్రారంభించారు. ఇవాళ ఉదయం టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ తో ముందుగా భేటీ అయ్యారు. మోడీతో పలు విషయాలు చర్చించిన మస్క్.. అనంతరం మీడియాతో ఆ విషయాలు పంచుకున్నారు. తాను మోదీ అభిమానినని, ప్రధానితో ఇది అద్భుతమైన సమావేశం ,తనకు ఆయనంటే చాలా ఇష్టం అన్నారు. కొన్ని సంవత్సరాల క్రితం మోడీ తమఫ్యాక్టరీని సందర్శించారు. కాబట్టి తాము ఒకరికొకరు కొంతకాలంగా తెలుసన్నారు. భారత్ భవిష్యత్తుపై తాను చాలా ఆసక్తిగా ఉన్నానని మస్క్ వెల్లడించారు.

Great meeting you today @elonmusk! We had multifaceted conversations on issues ranging from energy to spirituality. https://t.co/r0mzwNbTyN pic.twitter.com/IVwOy5SlMV
— Narendra Modi (@narendramodi) June 21, 2023
కానీ ఇప్పుడు ప్రధాని మోడీ మస్క్ తో తన చర్చల సందర్భంగా ఈ ఏడాది చివర్లో భారత్ లో టెస్లా ఫ్యాక్టరీ ప్రారంభించేందుకు అంగీకారం కుదిరినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి కేంద్రం నుంచి అన్ని విధాలా సహకారం అందిస్తామని మోడీ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో భారత్ లో టెస్లా ఎంట్రీపై మస్క్ నేరుగా ప్రకటన చేశారు. మస్క్తో తన భేటీపై ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేస్తూ, "ఈరోజు మిమ్మల్ని కలవడం చాలా బాగుంది @elonmusk! శక్తి నుండి ఆధ్యాత్మికత వరకు అనేక విషయాలపై మేము బహుముఖ సంభాషణలు చేసాము. అన్నారు. దీనికి బదులుగా "మళ్ళీ కలుసుకోవడం గౌరవంగా ఉంది." అంటూ మస్క్ ట్వీట్ చేశారు.
-
ఇరాన్ సుప్రీం లీడర్ గా ట్రంప్ ? అమెరికా అధ్యక్షుడి తాజా షాక్..! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
మార్కాపురం బస్సు ప్రమాద బాధితుల కోసం ప్రధాని కీలక ప్రకటన..!! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
"అప్పుడు వేరు.. ఇప్పుడు వేరు": భారత్ స్థానం మారింది - ప్రధాని మోడీ -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు












Click it and Unblock the Notifications