ప్యారిస్: పాయింట్ బ్లాక్ లో ఏకే-47 పేలలేదు (వీడియో)
ప్యారిస్: గత శుక్రవారం ప్యారిస్ నగరంలో ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్) ఉగ్రవాదులు జరిపిన మారణహోమంలో 129 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. 350 మందికి తీవ్రగాయాలైనాయి. అనేక మంది ప్రాణాలు అరచేతిలో పట్టుకుని పరుగు తీశారు.
అయితే ఓ మహిళతో పాటు దంపతులు ఏకే-47 చేతిలో పెట్టుకుని షూట్ చేస్తున్న ఉగ్రవాది నుంచి సినిమా ఫక్కిలో తప్పించుకుని బయటపడిన సీసీటీవీ క్లిప్పింగ్ లను ఫ్రాన్స్ పోలీసు అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఓ కేఫ్ లో జరిగిన ఈ సంఘటన వివరాలు ఈ విదంగా ఉన్నాయి. ఓ ఉగ్రవాది ఏకే-47 చేతపట్టుకుని కేఫ్ లోకి చోరబడి ఇష్టం వచ్చినట్లు కాల్పులు జరిపాడు. అదే సమయంలో పలువురు మరణించారు. అనేక మంది ప్రాణాలు అరచేతిలో పట్టుకుని పరుగు తీశారు.
అదే సమయంలో ఓ మహిళ ఉగ్రవాదికి చిక్కిపోయింది. రెండు అడుగులు ముందుకు వేసిన ఆ ఉగ్రవాది పాయింట్ బ్లాంక్ లో గురి పెట్టి మహిళ మీద కాల్పులు జరిపాడు. అయితే ఏకే-47 స్ట్రక్ అయిపోయింది. మూడు నాలుగు సార్లు ఉగ్రవాది ఏకే-47 ట్రిగర్ నొక్కాడు.
అయితే అది పేలలేదు. మహిళతో పాటు అక్కడున్న దంపతులు ఉగ్రవాది కళ్ల ముందే తప్పించుకుని బయటకు పరుగు తీశారు. ఆ కేఫ్ లోని సీసీ కెమెరాలలో ఈ దృశ్యాలు రికార్డు అయ్యాయి. ప్యారిస్ పోలీసులు ఆ క్లిప్పింగ్స్ స్వాధీనం చేసుకున్నారు.