Pakistan: తాను తవ్వుకున్న గోతిలో తానే పడ్డ పాకిస్థాన్.. చివరికి పశ్చాతాపం..
పాకిస్థాన్ తీవ్రవాదులపై సంచలన వ్యాఖ్యలు చేసింది.
ఎప్పుడైనా ఒకరి చెడు చేయాలని చూస్తే చివరికి మనకే చెడు జరుగుతుంది. అందుకే అంటారు ఎవరు తవ్వుకున్న గోతిలో వారే పడతారని. ఇప్పుడు ఈ సమేత పాకిస్థాన్ కు సరిగ్గా సరిపోయింది. భారత్ నాశనం కోసం తయారు చేసిన ముజాహిదీన్లు చివరికి పాకిస్థాన్ నే నాశనం చేస్తున్నారు. ఈ మాట స్వయంగా పాక్ మంత్రి పార్లమెంట్ లో చెప్పారు. ముజాహిదీన్లను సృష్టించి పాకిస్థాన్ తప్పు చేసిందని ఆ దేశ హోంమంత్రి రానా సనావుల్లా పార్లమెంటులో తెలిపారు.
12,600 కోట్ల డాలర్ల నష్టం
'మనం ముజాహిదీన్లను సృష్టించాం. వారే ఇప్పుడు ఉగ్రవాదులయ్యారు.' అని అన్నారు. ఉగ్రవాద దాడులతో తాము పడుతున్న కష్టాలను ప్రపంచం గుర్తించడం లేదని మరో మంత్రి ఖ్వాజా ఆసిఫ్ ఆవేదనగా ప్రసంగించారు. ఉగ్రవాద దాడుల్లో పాకిస్థాన్కు ఇప్పటి వరకు సుమారు 12,600 కోట్ల డాలర్ల ఆర్థిక నష్టం సంభవించిందని బాధపడ్డారు. పెషావర్ మసీదు లోపల పాకిస్తాన్ తన భద్రతా దళాలపై ఘోరమైన దాడిని చూసిన కొన్ని రోజుల తరువాత ఈ వ్యాఖ్యలు చేశాడు.
ఖవాజా ఆసిఫ్
రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ కూడా జాతీయ అసెంబ్లీలో మాట్లాడుతూ ఉగ్రవాదులపై ఆపరేషన్పై దేశ జాతీయ భద్రతా కమిటీ నిర్ణయం తీసుకుంటుందని అన్నారు.మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ) ప్రభుత్వం మరణశిక్ష అనుభవిస్తున్న చట్టవిరుద్ధమైన తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ (టిటిపి) లేదా పాకిస్తాన్ తాలిబాన్ సభ్యులను విడుదల చేసిందని చెప్పారు.
100 మంది మృతి
జనవరి 30న పెషావర్లోని మసీదు దాడిలో 100 మంది మృతి చెందగా, 220 మందికి పైగా గాయపడ్డారు. మసీదు సెంట్రల్ హాల్లో సోమవారం మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో పేలుడు సంభవించింది. అధికారికంగా తెహ్రీక్-ఇ-తాలిబాన్-ఇ-పాకిస్తాన్ అని పిలవబడే TTP, ఆఫ్ఘన్-పాకిస్తానీ సరిహద్దులో పనిచేస్తున్న వివిధ ఇస్లామిస్ట్ సాయుధ తీవ్రవాదులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని తెలిపారు.
పాకిస్థాన్
పాకిస్థాన్ ఉగ్రవాదులను పెంచి పోషించి చివరికి ఆ ఉగ్రవాదులు ఘాతుకానికి పాక్ బలైపోతోంది. సో దీన్ని బట్టి ఇతరుల నాశనం కోరుకునే బదులు మనం సరిగ్గా ఉంటే మంచిదని అర్థం అవుతుంది. ఇప్పటికైనా పాక్ తన తప్పును తెలుసుకుంటే మంచిది