వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పట్టాలపైకి బస్సు.. ఢీకొట్టి లాక్కెళ్లిన రైలు(వీడియో)
బ్యాంకాక్: థాయ్లాండ్ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రైలు పట్టాలపైకి వచ్చిన ఓ పర్యాటక బస్సును వేగంగా వస్తున్న రైలు ఢీకొట్టింది. దీంతో బస్సులోని డ్రైవర్ తోపాటు ముగ్గురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు.
బస్సులోని 30మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదం ఆదివారం చేసుకుంది. సమాచారం అందుకున్న సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించాయి.
రైలు రాకను బస్సు డ్రైవర్ గమనించకుండా రైలు పట్టాలపై నుంచి బస్సును ముందుకు నడిపించడమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. బస్సును ఢీకొట్టిన రైలు ఆ బస్సును కొంత దూరం వరకు లాక్కెళ్లినట్లు అక్కడి కెమెరాల్లో రికార్డైంది.
Comments
English summary
A bus was hit a moving train at a railway crossing in Thailand, resulting the death of three people. The accident occurred early on Sunday morning when the bus collided with the train, which was heading to a station.
Story first published: Monday, April 4, 2016, 16:43 [IST]