50కి పైగా వాహనాలు ఒకదానికొకటి ఢీ.. 17 వాహనాలు అగ్నికి ఆహుతి !!
ప్రపంచ వ్యాప్తంగా చోటు చేసుకుంటున్న వరుస ప్రమాద ఘటనలు ప్రజలకు భయాందోళన కలిగిస్తున్నాయి. ఓ వైపు రోడ్డు ప్రమాదాలు.. మరో వైపు రైలు ప్రమాదాలు, విమాన ప్రమాదాలు సైతం జరిగి పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతుండడం సర్వత్రా ఆవేదన నింపుతున్నాయి. ఇప్పుడు జపాన్లోని గున్మా ప్రిఫెక్చర్లోని మినాకామి పట్టణం సమీపంలో గల కన్-ఎత్సు ఎక్స్ప్రెస్వేపై ఘోర ప్రమాదం సంభవించింది. శుక్రవారం రాత్రి ఈ దుర్ఘటన జరిగినట్టు తెలుస్తోంది.
భారీగా మంచు కురుస్తుండడం.. రోడ్డుపై గడ్డకట్టిన మంచుతో 50కి పైగా వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో ఒకరు మరణించగా, 26 మందికి గాయాలయ్యాయి. ప్రమాదం అనంతరం సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో అనేక వాహనాలు కాలి బూడిదయ్యాయి. కాగా రాత్రి 7:30 గంటల సమయంలో మొదట రెండు ట్రక్కులు ఢీకొన్నాయని అధికారులు వెల్లడించారు. అయితే ఆ తర్వాత వెనుక వస్తున్న వాహనాలు బ్రేక్స్ వేయడంతో విఫలమవ్వడంతో.. ఒకదాని వెనుక ఒకటి ఢీకొన్నట్టు చెబుతున్నారు.

క్షణాల వ్యవధిలోనే సుమారు 50కి పైగా వాహనాలు ఒకదానికొకటి ఢీ కొన్నాయని ప్రత్యక్ష సాక్షులు వెల్లడిస్తున్నారు. అంతే కాకుండా ప్రమాదం అనంతరం కొన్ని వాహనాల్లో మంటలు చెలరేగి దాదాపు 17 వాహనాలకు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో టోక్యోకు చెందిన 77 ఏళ్ల వృద్ధురాలు మరణించినట్లు పోలీసులు ధ్రువీకరించారు. అలానే 26 మంది గాయపడగా.. వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని ప్రకటించారు.
కన్-ఎత్సు ఎక్స్ప్రెస్వే రాజధాని టోక్యోను నిగాటా ప్రిఫెక్చర్తో అనుసంధానించే కీలక రహదారి. జపాన్లో నూతన సంవత్సర సెలవులు ప్రారంభమైన వేళ, ప్రయాణికుల రద్దీ అధికంగా ఉన్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈస్ట్ నిప్పాన్ ఎక్స్ప్రెస్వే కంపెనీ (NEXCO ఈస్ట్) ప్రమాదం కారణంగా రహదారిపై రాకపోకలను నిలిపివేసింది. ప్రస్తుతం పోలీసులు ఘటనా స్థలంలో దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తు, భద్రతా తనిఖీలు పూర్తయిన తర్వాతే రహదారి ట్రాఫిక్కు ఎప్పుడు అనుమతిస్తారనే దానిపై స్పష్టత వస్తుందని అధికారులు చెప్పారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications