ఘోర బస్సు ప్రమాదం: నిద్రలోనే 42 మంది మృతి..!!
సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఉమ్రా యాత్రికులతో వెళ్తున్న బస్సు డీజిల్ ట్యాంకర్ను ఢీకొనడంతో 42 మంది భారతీయ యాత్రికులు మరణించినట్లు సమాచారం. ఈ ఘటన సోమవారం తెల్లవారుజామున 1:30 గంటలకు ముఫ్రిహాట్ అనే ప్రాంతంలో జరిగింది.
మక్కా నుండి మదీనాకు వెళ్తున్న బస్సులో ప్రయాణిస్తున్న యాత్రికుల్లో మహిళలు, పిల్లలు కూడా ఉన్నారు. మృతుల్లో ఎక్కువ మంది హైదరాబాద్ వాసులే అని ప్రాథమిక నివేదికలు సూచిస్తున్నాయి. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో సుమారు 20 మంది మహిళలు, 11 మంది పిల్లలు ఉన్నట్లు తెలుస్తోంది.

ఉమ్రా యాత్ర ముగించుకుని మక్కా నుంచి మదీనాకు వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. బస్సులోని చాలా మంది ప్రయాణికులు నిద్రిస్తున్న సమయంలోనే ఈ ప్రమాదం జరిగిందని సమాచారం. స్థానిక వర్గాల ప్రకారం, 42 మంది మరణించినట్లు నివేదించబడినప్పటికీ, అధికారులు ఇంకా మృతుల సంఖ్యను, క్షతగాత్రుల పరిస్థితిని ధృవీకరిస్తున్నారు.
ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.












Click it and Unblock the Notifications