Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కోరమాండల్ తరహా రైలు ప్రమాదం- పలువురు దుర్మరణం

ఒడిశాలో కోరమాండల్ ఎక్స్ ప్రెస్ తరహాలో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. రెండు హైస్పీడ్ రైళ్లు ప్రమాదానికి గురయ్యాయి. ఎదురెదురుగా ఢీ కొట్టాయి. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. 100 మందికి పైగా గాయపడ్డారు. వారిలో 25 మంది పరిస్థితి విషమంగా ఉంది. ఫలితంగా మృతుల సంఖ్య మరింత పెరగొచ్చనే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి. సమాచారం అందిన వెంటనే రెస్క్యూ సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని, సహాయక చర్యలు చేపట్టారు.

స్పెయిన్ దక్షిణ ప్రాంతంలో కార్డోబా ప్రావిన్స్‌లో ఈ దుర్ఘటన సంభవించింది. అదముజ్ టౌన్ వద్ద ఆ దేశ కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం 6:40 నిమిషాల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. 21 మంది మరణించారు. 100 మందికి పైగా గాయపడ్డారు. తొలుత ఓ హైస్పీడ్ రైలు పట్టాలు తప్పింది. మలగా నుండి మాడ్రిడ్‌కు వెళ్తున్న నంబర్ 6189 ఇరియో హై-స్పీడ్ రైలు అది. దాని బోగీలు పక్కనే ఉన్న ట్రాక్ పై చెల్లాచెదురుగా పడ్డాయి. అదే సమయంలో మాడ్రిడ్ నుండి హుయేల్వాకు బయలుదేరిన మరో రెన్ఫే రైలు వాటిని ఢీ కొట్టింది.

Tragic Spain Train Derailment Kills 21 Dozens Injured in High-Speed Crash

కార్డోబా నుండి బయలుదేరిన 10 నిమిషాల్లో పట్టాలు తప్పింది ఇరియో రైలు. పక్క ట్రాక్‌పైకి దూసుకుపోయింది. ప్రమాద సమయంలో ఇరియో రైలులో 300 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. రెన్ఫే సర్వీస్‌లో సుమారు 100 మంది ఉన్నట్లు రెస్క్యూ సిబ్బంది తెలిపారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, పారామెడిక్ బృందాలు, రెడ్‌క్రాస్‌తో సహా అత్యవసర సేవల ఉద్యోగులు ప్రమాద స్థలానికి చేరుకుని, సహాయక చర్యలు చేపట్టాయి.

పలువురు ప్రయాణికులు దెబ్బతిన్న బోగీలలో గంటల తరబడి చిక్కుకుపోయారు. ఇరియో రైలును ఖాళీ చేశామని, రెన్ఫే బోగీలలో పరిస్థితి దారుణంగా ఉందని కార్డోబా ఫైర్ సర్వీస్ చీఫ్ పాకో కార్మోనా తెలిపారు. పలువురు ప్రయాణికులు బోగీల్లో చిక్కుకుపోయారని, ఎంత మంది మరణించారో తెలియట్లేదని అన్నారు. నుజ్జునుజ్జు అయిన బోగీల నుంచి వారిని సురక్షితంగా వెలికి తీయాల్సి వస్తోందని అన్నారు.

గాయపడ్డ వారిని మాడ్రిడ్, అండలూసియాలోని ఆసుపత్రులకు తరలించారు. సుమారు 5,000 మంది నివాసితులు ఉన్న అదముజ్ టౌన్ లో అప్పటికప్పుడు ఓ హెల్ప్ సెంటర్, మెడికల్ క్యాంప్ ను ఏర్పాటు చేశారు. పలువురు మెడికల్ వలంటీర్లు స్వచ్ఛదంగా వైద్య సేవలను అందిస్తోన్నారు. రాత్రివేళ.. మైనస్ కు పడిపోయిన ఉష్ణోగ్రత మధ్య గాయపడ్డ వారికి ఆహారం, దుప్పట్లు, వేడి పానీయాలు అందిస్తోన్నారు. ఈ ప్రమాదం కారణంగా మాడ్రిడ్, అండలూసియా మధ్య అన్ని హైస్పీడ్ రైలు సేవలను నిలిపివేశారు. కొన్నింటిని దారి మళ్లించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+