శుభవార్త:ట్రంప్ తో భారత్ కు మేలే, అమెరికాకు భారత్ అవసరం ఉంది
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిపాలన వర్గంతో భారత్ కు ప్రయోజనమేనని భారతీయ వ్యాపార మండలి తెలిపింది. భారత్ అమెరికాల మద్య సంబందాలకు ట్రంప్ పరిపాలన వర్గం సహకరిస్తోందని అభిప్రాయపడింది యూఎస్ఐబిసి.
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిపాలన వర్గంతో భారత్ కు ఎంతో మేలు చేకూరనుందని అమెరికాలోని ప్రముఖ భారతీయ వ్యాపార మండలి (యూఎస్ ఐ బిసి ) తెలిపింది.
అమెరికాలోని యూఎస్ ఐబిసి ప్రముఖ వ్యాపార విభాగంగా పనిచేస్తోందని , ఆ సంస్థ అధ్యక్షుడు ముఖఏస్ ఆఘే శుక్రవారం నాడు మీడియాకు చెప్పారు.
అమెరికాకు ఇప్పుడున్న పరిస్థితుల్లో భారత్ అవసరం ఉందన్నారు. ప్రస్తుతం జియో పొలిటికల్ విధానంలో భారత్ కూడ కాస్తంత ఆందోళనకరమైన పరిస్థితుల మధ్య ఉన్న నేపథ్యంలో ఢిల్లీకి కూడ వాషింగ్టన్ అవసరం ఉంది. ఇప్పటివరకు భారత్ అమెరికాల మధ్య ఉన్న సంబంధాలను బట్టి చూస్తే ట్రంప్ పరిపాలన వర్గం భారత్ కు చాలా ఉపకరిస్తోంది.

భారత ఆర్థిక శ్రేయస్సు అనే అంశం అమెరికాకు మేలు చేయనుంది. భారత్ తనను తాను సమర్థంగా రక్షించుకోగల సైనిక బలాన్ని నానాటికి పెంచుకొంటూ పోతోంది. ఈ రెండు అంశాలు అమెరికా భారత్ వైపు చూసేందుకు కారణంగా ఆయన చెప్పారు.
అలాగే భారత్ కూడా అమెరికాను బలమైన దేశంగా నమ్ముతోంది. ట్రంప్ పాలన వర్గం మోడీ ప్రభుత్వం మధ్య బలమైన సానుకూల ఒప్పందాలు జరుగుతాయని తాను అనుకొంటున్నానని చెప్పారు. ఈ ఏడాది తర్వాత వీరిద్దరి సమావేశమయ్యే అవకాశం ఉందన్నారు.
-
ఇరాన్ వార్ ఆపేద్దాం సార్..? ట్రంప్ కు సలహాదారుల షాక్.! -
యుద్ధం ముగుస్తుందా? ఇరాన్పై ట్రంప్ సంచలన ప్రకటన! -
చైనా, పాకిస్థాన్ కు ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన భారత్.. -
T20 World Cup Final: భారత పేసర్ కు ఐసీసీ డబుల్ షాక్..! -
ప్లీజ్ మా నాన్న "ఏడో పెళ్లి" ఆపండి.. మైనర్ కొడుకు షాకింగ్ రిక్వెస్ట్ !! -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..!












Click it and Unblock the Notifications