భారత్, పాకిస్థాన్ రావాలి.. ట్రంప్ ఆహ్వానం.. కారణం ఇదే!
గాజాలో నెలకొన్న సంక్షోభాన్ని తగ్గించేందుకు గాజా శాంతి మండలిలో భాగస్వామ్యం కావాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ ను ఆహ్వానించారు. భారత్ కు ఇజ్రాయిల్, పాలస్తీనాతో చారిత్రాత్మక సంబంధాలు ఉన్న నేపథ్యంలో ట్రంప్ ఈ మేరకు భారత్ కు ఆహ్వానం పంపారు. అలాగే గాజాలో ఇప్పటికే అనేకసార్లు భారత్ మానవతాసాయం ప్రకటించింది. గాజాలో యుద్ధం మొదలైనప్పటి నుంచి ఆ ప్రాంతానికి భారత్ సాయం చేస్తోంది.
ఇజ్రాయిల్, పాలస్తీనా మధ్య శాశ్వత శాంతిని నెలకొనడానికి ఏర్పాటు చేసిన గాజా శాంతి మండలికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఆహ్వానం పంపించారు. పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులపై భారత్ ఎప్పటికప్పుడు ఆందోళన చెందుతున్న విషయం తెలిసిందే. ఇక శాంతియుత చర్చలకు, టెర్రరిజాన్ని నిర్మూలించేందుకు భారత్ ఎప్పుడూ ముందుంటుందన్న విషయం తెలిసిందే.
ఇక అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆహ్వానాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ గతంలోనూ స్వాగతించారు. ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు సఫలం కావాలని ఇప్పటికే భారత్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు టెర్రరిజం ఎలాంటి రూపంలో ఉన్నా.. ఎక్కడ ఉన్నా సహించేది లేదని ప్రధాని మోదీ గతంలోనే స్పష్టం చేశారు.
మరోవైపు పాకిస్థాన్ కు కూడా ట్రంప్ ఆహ్వానం పంపించారు. ఈ మేరకు ట్రంప్ నుంచి తమకు ఆహ్వానం అందిందని పాకిస్థాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఎక్స్ వేదికగా స్పష్టం చేసింది. పాకిస్థాన్ తో పాటు 11 దేశాలకు ట్రంప్ ఆహ్వానం పంపించారు. ఈ లిస్టులో అర్జెంటీనా, టర్కీ, ఈజిప్టు, జోర్డాన్, కెనడా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్ , జర్మనీ, ఇండోనేషియా, ఇటలీ, మొరాకో లు ఉన్నాయి.

ఇక ఏళ్లపాటు సాగుతున్న ఇజ్రాయెల్- హమాస్ మధ్య గాజా స్ట్రిప్ యుద్ధాన్ని ఆపేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 21 సూత్రాలతో ఒక శాంతి సూత్రాన్ని రూపొందించిన విషయం తెలిసిందే. ట్రంప్ నిర్ణయాన్ని భారత్, చైనా, రష్యాలతోపాటుగా పలు ముస్లిం దేశాలు కూడా సమర్థించాయి.












Click it and Unblock the Notifications