మోడీ ప్రసంగాన్ని ఆసక్తిగా ఆలకించిన ట్రంప్..
అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ .. ఐక్యరాజ్యసమితిలో వాతావరణ మార్పులపై ప్రసంగించారు. మాటలు చాలు.. మిగిలింది చేతలే అని ప్రకటించారు. అయితే మోడీ మాట్లాడే సమయానికి అక్కడికి ఓ విశిష్ట అతిథి కూడా వచ్చారు. ఆయనే అగ్రరాజ్య అధినేత డొనాల్డ్ ట్రంప్. వాస్తవానికి ట్రంప్ షెడ్యూల్ ఐక్యరాజ్యసమితి సమిట్లో లేదు. కానీ మోడీపై ఉన్న అభిమారంతో అక్కడికి విచ్చేసి మోడీ చెప్పిన అంశాలను సావధానంగా అలకించారు. వాతావరణ మార్పులపై ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచ దేశాలు చేయాల్సిన అంశాలపై దృష్టిసారించింది.

అంతకుముందు వాతావరణ మార్పులపై మోడీ ప్రసంగించారు. మాటలు చాలని మిగిలింది చేతల్లో చూపాలని కోరారు. వాతావరణాన్ని పరిరక్షించుకునేందుకు మాటలు కోటలు దాటుతున్నాయని .. కానీ పని మాత్రం జరగడం లేదన్నారు. దీంతోపాటు పునరుత్పాదక వనరుల వినియోగం కూడా అవసరమేనని నొక్కి వక్కానించారు. దేశంలో సోలార్ విద్యుత్ ఉత్పత్తి క్రమంగా పెరిగిందని పేర్కొన్నారు మోడీ. తమతో 80 దేశాలు కలిసి పనిచేస్తున్నాయని ఈ సందర్భంగా గుర్తుచేశారు. పర్యావరణ పరిరక్షణ కోసం తీసుకునే చర్యలపై మిగతా అధినేతలు దృష్టిసారించాలని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇప్పటికే వాతావరణ మార్పులు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
-
ఇరాన్ ఇక చేతులెత్తేయాల్సిందే! డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన!! -
యుద్ధంలోనూ కొత్త శకం.. డ్రోన్లతో వార్, పశ్చిమాసియాలో 10వేల అమెరికా మెరోప్స్ డ్రోన్లు! -
గుడ్డులో పచ్చ సొన ఎవరికి మంచిది, ఎవరికి డేంజర్..!! -
ఇక అమెరికా చేతుల్లోకి హార్మూజ్ జలసంధి: ట్రంప్ సంచలనం -
ట్రంప్కు తలనొప్పి.. పుతిన్కు పండగ!: భారత్, చైనాకు రష్యానే దిక్కు! -
ఇరాన్ జీవనాడిపై అమెరికా దెబ్బ- ఓటమిని అంగీకరించిందని ట్రంప్ ప్రకటన -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు












Click it and Unblock the Notifications