Tsunami: ఫిలిప్పీన్స్ లో సునామీ హెచ్చరికలు-7.5 తీవ్రతతో భూకంపం...
ఫిలిప్పీన్స్లోని మిండనావోలో ఇవాళ 7.5 తీవ్రతతో భూకంపం వచ్చింది. యూరోపియన్-మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ అందించిన వివరాల ప్రకారం ఈ భూకంప కేంద్రం 63 కిమీ (39 మైళ్లు) లోతులో ఉందని తెలిపింది. భూకంపం తర్వాత అమెరికా సునామీ హెచ్చరికల వ్యవస్థ సునామీ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో అక్కడి ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.
గత నెలలో దక్షిణ ఫిలిప్పీన్స్లో వచ్చిన 6.7 తీవ్రత కల భూకంపం కారణంగా ఎనిమిది మంది చనిపోయారు. ఇప్పుడు అంతకన్నా ఎక్కువగా 7.5 తీవ్రతతో భూకంపం రావడంతో ప్రజలు ఇళ్లలో నుంచి బయటికి పరుగులు తీశారు. ఈ భూకంపం కారణంగా ప్రాణనష్టం, ఆస్తినష్టం ఎంత జరిగిందన్నదీ ఇంకా తెలియరాలేదు. అంతలోనే సునామీ హెచ్చరికలు కూడా రావడంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

నవంబర్ 17న వచ్చిన భూకంపంలో మరణాలు ఎక్కువగా సారంగని, సౌత్ కోటాబాటో, దావో ఆక్సిడెంటల్ ప్రావిన్సులలో నమోదయ్యాయి. ఈ భూకంపంలో 13 మంది ప్రజలు గాయపడ్డారు. ఈ భూకంపమే ప్రజల్ని భయాందోళనలకు గురి చేసింది. అలాగే ఈ భూకంపం కారణంగా 50కి పైగా ఇళ్లు, ఇతర భవనాలు ధ్వంసం అయ్యాయి. పసిఫిక్ "రింగ్ ఆఫ్ ఫైర్"లో ఉన్న ఫిలిప్పీన్స్లో తరచుగా భూకంపాలు సంభవిస్తాయి. దీనిని అమెరికా జియోలాజికల్ సర్వే ప్రపంచంలో అత్యంత భూకంప, అగ్నిపర్వత క్రియాశీల జోన్ గా గుర్తించింది. ఈ ప్రాంతంలో ఇప్పుడు మరోసారి భూకంపం రావడం, సునామీ హెచ్చరికలు జారీ చేయడం కలకలం రేపుతోంది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications