ట్విట్టర్ సీఈఓ డోర్సేకు ల్యాప్ట్యాప్ లేదు
శాన్ఫ్రాన్సిస్కో: ట్విట్టర్ సీఈఓగా పనిచేస్తున్న జాక్డోర్సే వద్ద స్వంత ల్యాప్టాప్ లేదు. ఆయన ల్యాప్టాప్ను వాడరని ఆయనే స్వయంగా వెల్లడించారు. తన మొబైల్ ద్వారానే ఆయన అన్ని పనులు చేసుకొంటారని ఆయన వెల్లడించారు.
ట్విట్టర్ సీఈఘఓ జాక్ డోర్సే తన మొబైల్ ఫోన్నే ల్యాప్ టాప్ మాదిరిగా ఉపయోగిస్తారు. అందుకే ఆయన వద్ద స్వంతంగా ల్యాప్ టాప్ లేదని ఆయన స్వయంగా వెల్లడించారు. ఓ ఇంటర్వ్యూలో డోర్సే ఈ విషయాన్ని వెల్లడించారు.

తాను ల్యాప్టాప్ వాడననని, ప్రతీది తన ఫోన్ ద్వారానే నిర్వహిస్తానని చెప్పారు. తన సొంత ఆన్లైన్ సెక్యురిటీ ప్రాక్టిస్ విషయాలపై మాట్లాడుతున్న సమయంలో డోర్సే ఈ విషయాన్ని వెల్లడించారు.
నోటిఫికేషన్లన్నింటినీ ఆపివేసి ఒక సమయంలో ఒక పనిని మాత్రమే చేస్తానని, తన ముందున్న దానిపైనే దృష్టిపెట్టడం తనకు అలవాటని పేర్కొన్నారు. ల్యాప్టాప్పై అన్ని ఒకేసారి చేయడం కంటే ఇదే బెస్ట్ అని చెప్పారు.
ల్యాప్టాప్లాగా ఫోన్ను వాడటానికి పలు వాయిస్ టైపింగ్ టూల్స్ ఉన్నాయన్నారు. కేవలం మైక్రోబ్లాగింగ్ కంపెనీని నిర్వహించడమే కాకుండా తన డిజిటల్ జీవితాన్ని నిజ జీవితాన్ని తగిన విధంగా బ్యాలెన్స్ చేసుకుంటూ పలువురి మన్ననలు పొందుతున్నారు డోర్సే.
ప్రైవసీ, సెక్యురిటీ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా వహించాలని, మీ డేటాను సురక్షితంగా ఉంచుకోవడానికి మీ వద్ద ఉన్న కంపెనీ డేటాకు రక్షణ కలిగించడానికి అవసరమైన టూల్స్ గురించి తెలుసుకుని ఉండాలని చెప్పారు. 2015లో జాక్ డోర్సే రెండోసారి ట్విటర్ సీఈవోగా ఎంపికయ్యారు.
-
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..? -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
LPG కొరతకు చెక్.. భారత్ మార్కెట్ లోకి DME Fuel !! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
మాస్కోలోని పుతిన్ నివాసంలో తలదాచుకున్న ఇరాన్ సుప్రీం లీడర్..?? -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications