విమాన ఇంజిన్లో మంటలు: కూలి ఇద్దరు పైలట్లు మృతి
బీజింగ్: చైనా నేవీ విమానం ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఇద్దరు పైలెట్లు మృతి చెందారు. వివరాలిలా ఉన్నాయి. చైనా నౌకాదళానికి చెందిన ఓ ఎయిర్ క్రాప్ట్ చైనా ఈశాన్య ప్రాంతంలో కుప్పకూలింది.
ఈ ప్రమాదంలో శిక్షణ ఇస్తున్న 27 ఏళ్ల పైలెట్ జియాంగ్తో పాటు శిక్షణ తీసుకుంటున్న మరో 22 ఏళ్ల పైలెట్ లు పెయింగుయ్లు ఇద్దరూ మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. వీరిద్దరు చైనీస్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ నేవీ ఫ్త్లెట్ స్కూల్కు చెందిన వారు.

విమానం ఇంజిన్లో మంటలు చెలరేగడం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లు వెల్లడించారు. ఈ ఘటన మే 13న జరిగింది. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలను చైనా నేవీ మంగళవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.
విమానం ఇంజిన్లో మంటలు చెలరేగిన 17 సెకన్లకే విమానం కూలిపోయిందని పేర్కొన్నారు. మంటలు చెలరేగిని విమానం నుంచి ఇద్దరు పైలెట్లు ప్యారాచూట్ సహాయంతో తప్పించుకోవడానికి యత్నించారని, తక్కువ సమయం ఉండటంతో వీరు మృతి చెందినట్లు ఆ ప్రకటనలో చైనా నేవీ పేర్కొంది.
-
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు












Click it and Unblock the Notifications