ఆ సముద్రంలో అపార సంపద.. ఆధిపత్యం కోసం చైనా తహతహ.. అమెరికా, జపాన్ సీరియస్
వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంలో చైనా కృత్రిమ దీవులను ఏర్పాటు చేయడాన్ని, వాటిపై నిర్మాణాలు చేపట్టడాన్ని, సైనికీకరణను అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాలు ముక్త కంఠంతో ఖండించాయి.
మనీలా: వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంలో చైనా కృత్రిమ దీవులను ఏర్పాటు చేయడాన్ని, వాటిపై నిర్మాణాలు చేపట్టడాన్ని, సైనికీకరణను అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాలు ముక్త కంఠంతో ఖండించాయి.
చైనా పట్ల ఆగ్నేయాసియా దేశాల సమాఖ్య(ఆసియాన్) వైఖరి మెత్తబడ్డ తరుణంలో ఈ మూడు దేశాలు ఆదివారం ఈ మేరకు ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. దక్షిణ చైనా సముద్ర వివాదంపై అంతర్జాతీయ మధ్యవర్తిత్వ ట్రైబ్యునల్ నిరుడు ఇచ్చిన తీర్పును చైనా, ఫిలిప్పీన్స్ గౌరవించాలని డిమాండ్ చేశాయి.

అపార సంపద.. అందుకే ఆధిపత్య పోరు
దక్షిణ చైనా సముద్రం గుండా ఏటా సుమారు ఐదు లక్షల కోట్ల డాలర్ల నౌకా వాణిజ్యం సాగుతుంది. ఈ సముద్రంలో అపార చమురు, గ్యాస్ నిక్షేపాలు ఉన్నాయని భావిస్తున్నారు. దాదాపు ఈ సముద్రమంతా తనదేనని చైనా వాదిస్తోంది. ఇందులో తమకూ భాగముందని వియత్నాం, మలేసియా, మరికొన్ని ఆసియాన్ సభ్యదేశాలు పేర్కొంటున్నాయి. దీంతో వివాదం ఏర్పడింది. ఈ వివాదంలో తన మాటే నెగ్గాలని, దక్షిణ చైనా సముద్రంపై తన ఆధిపత్యమే సాగాలని చైనా భావిస్తోంది.

మెత్తబడ్డ ఆసియాన్ సభ్యదేశాలు...
ఆసియాన్లో వియత్నాం, కంబోడియా, మలేషియా, ఇండొనేషియా, ఫిలిప్పీన్స్, థాయ్లాండ్, బ్రూనై, లావోస్, మయన్మార్, సింగపూర్ సభ్య దేశాలుగా ఉన్నాయి. కొన్నేళ్లుగా పలు సభ్యదేశాలకు చైనా దౌత్య, ఆర్థిక మార్గాల ద్వారా చేరువవుతూ వాటి వైఖరి మెత్తబడేలా చేస్తోంది. శనివారం ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో ఒక సదస్సు సందర్భంగా ఆసియాన్ మంత్రులు విడుదల చేసిన ప్రకటనే దీనికి నిదర్శనం. ఇందులో వారు ప్రదర్శించిన మెతక వైఖరి చైనా పైచేయి సాధించడాన్ని స్పష్టం చేస్తోంది.

వ్యతిరేకించిన వియత్నాం, కంబోడియా మద్దతు
దక్షిణ చైనా సముద్రం వివాదం విషయంలో చర్చలపై చైనా విధివిధానాలకు ఆసియాన్ సభ్య దేశాలు ఒక ప్రకటనలో అంగీకారం తెలిపాయి. దక్షిణ చైనా సముద్రంపై చైనా, ఆసియాన్ సభ్యదేశాల ప్రవర్తనా నియమావళికి చట్టపరంగా కట్టుబడక్కర్లేదని చైనా చెబుతోంది. అయితే చర్చల్లో చైనా వాదనను వియత్నాం మాత్రం గట్టిగా వ్యతిరేకించింది. కానీ కంబోడియా ‘డ్రాగన్'కు అండగా నిలిచింది. చివరకు చైనాకు అనుకూలమైన ఫలితమే వచ్చింది.

‘ట్రైబ్యునల్ తీర్పును గౌరవించాలి’
సదస్సు సందర్భంగా మనీలాలో అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రులు సమావేశమై వివాదంపై చర్చించారు. ‘‘ఏ ప్రవర్తనా నియమావళైనా చట్టపరంగా కట్టుబడేలా, అర్థవంతంగా, ప్రభావవంతంగా ఉండాలి'' అని సంయుక్త ప్రకటనలో వారు డిమాండ్ చేశారు. ఆసియాన్ సభ్యదేశాల ప్రకటనలో ఈ డిమాండ్ లేదు. దక్షిణ చైనా సముద్ర వివాదంపై అంతర్జాతీయ మధ్యవర్తిత్వ ట్రైబ్యునల్ నిరుడు ఇచ్చిన తీర్పును చైనా, ఫిలిప్పీన్స్ గౌరవించాలని అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా డిమాండ్ చేశాయి. ఈ సముద్రంపై చైనా వాదనలను చాలా వరకు ట్రైబ్యునల్ తోసిపుచ్చింది. ఈ వివాదంలో ‘బయటివారు' తల దూర్చొద్దని అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాలను ఉద్దేశించి చైనా పేర్కొంటోంది.
-
గెట్ అవుట్: నమ్మకమైన స్నేహితురాలికే ట్రంప్ షాక్. -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications