మసూద్ అజహర్ నిషేధం: చైనాకు ట్రంప్ షాక్, భారత్కు మద్దతు
ముంబై, పఠాన్కోట్ పేలుళ్ల సూత్రధారి, జైష్ ఏ మహమ్మద్ చీఫ్ మసూద్ అజహర్ పైన నిషేధం విధించాలని ఐక్యరాజ్య సమితికి భారత్ పదేపదే విజ్ఞప్తి చేస్తోంది. దీనికి అమెరికా గట్టి మద్దతు ఇచ్చింది.
న్యూఢిల్లీ: ముంబై, పఠాన్కోట్ పేలుళ్ల సూత్రధారి, జైష్ ఏ మహమ్మద్ చీఫ్ మసూద్ అజహర్ పైన నిషేధం విధించాలని ఐక్యరాజ్య సమితికి భారత్ పదేపదే విజ్ఞప్తి చేస్తోంది. దీనికి అమెరికా గట్టి మద్దతు ఇచ్చింది.

ఈ విషయంలో భారత్కు అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ బాసటగా నిలిచారు. మసూద్ అజహర్ పైన నిషేధం విధించాలని తాజాగా అమెరికా కూడా ఐక్యరాజ్య సమితిని కోరింది. తద్వారా అజహర్ నిషేధం పైన అడ్డు తగులుతున్న చైనాకు అమెరికా గట్టి జవాబిచ్చింది. అయితే, చైనా మాత్రం ఎప్పటిలాగే వ్యతిరేకించింది.
పాకిస్తాన్తో అంటకాగుతున్న చైనా మసూద్ అజహర్ విషయంలో భారత్ ఐక్యరాజ్య సమితికి విజ్ఞప్తి చేసిన ప్రతిసారీ ఆ వాదనను తోసిపుచ్చుతోంది. ట్రంప్ ప్రభుత్వం తాజా నిర్ణయం చైనాకు, ఉగ్రవాదులను భారత్ పైకి ఉసిగొల్పుతున్న పాక్కు షాక్ కానుంది.












Click it and Unblock the Notifications