ఈ శిథిలాలు ఎంహెచ్ 370 విమానానివేనా?
కౌలాలంపూర్: పశ్చిమ హిందూ మహా సముద్రంలోని ఫ్రెంచ్ ద్వీపమైన రీయూనియన్ ద్వీపం తీర ప్రాంతానికి కొన్ని విమాన శిథిలాలు కొట్టుకొచ్చాయి. ఆ శిథిలాలు నిరుడు అదృశ్యమైన ఎమ్హెచ్ 370 మలేషియన్ విమానానికి సంబంధించినవిగా తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో ఆ శిథిలాలు ఎంహెచ్ 370 విమానానివేనా? లేక వేరేవా? అనే విషయం తేల్చే ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ సంగతి తేల్చడానికి ఓ బృందాన్ని పంపామని మలేషియా రవాణా శాఖా మంత్రి ఎల్టీ లై చెప్పారు.
Reported #MH370 debris recovery: Close-up of 'flaperon' on 9M-MRO from LAX approach June 2012 @airlivenet @PeurAvion pic.twitter.com/2v5AYHCSXM
— Michael Raisch (@RaischStudios) July 29, 2015 ఈ బృందం దర్యాప్తు జరిపి ఆ శకలాలు అదృశ్యమైన ఎమ్హెచ్ 370కి చెందినవా లేదా కూలిన ఎమ్హెచ్ 17వా గుర్తించి నివేదిక త్వరలోనే ఇస్తుందన్నారు. రీయూనియన్ ద్వీప స్థానికులు రెండు మీటర్ల వెడల్పు గల విమానం రెక్కను కనుగొన్నారు. అది అదృశ్యమైన ఎమ్హెచ్ 370 విమానానికి చెందినవే అని వారు అంటున్నారు.
నిరుడు మార్చిలో కౌలాలంపూర్ నుంచి బీజింగ్కు బయలుదేరిన ఎమ్హెచ్ 370 విమానం 40 నిమిషాలకే జాడ తెలియకుండా పోయిన విషయం తెలిసిందే. పలు దేశాలు గాలింపు చర్యలు చేపట్టినా లాభం లేకపోయింది. ఆ విమానంలో 239 ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు.
-
ఖమేనీ సంధి ఒప్పందం? -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్..












Click it and Unblock the Notifications