డామ్రే తుపాను బీభత్సం... 49 మంది మృతి
వియత్నాం, మలేసియాలో కుండపోత వానలు, పెను గాలులతో డామ్రే తుపాను సృష్టిస్తోన్న పెను బీభత్సానికి ఇప్పటి వరకు 49 మంది బలయ్యారు. ఈ తుపాను ధాటికి వియత్నాంలో 49 మంది ప్రాణాలు కోల్పోగా..
హనోయ్: వియత్నాం, మలేసియాలో కుండపోత వానలు, పెను గాలులతో డామ్రే తుపాను సృష్టిస్తోన్న పెను బీభత్సానికి ఇప్పటి వరకు 49 మంది బలయ్యారు. ఈ తుపాను ధాటికి వియత్నాంలో 49 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 22 మంది గల్లంతయ్యారు.
వియత్నాంలో గంటకు 130 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న గాలుల కారణంగా 40 వేలకు పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమై ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా మలేసియాలో తుపాను బీభత్సానికి ఐదుగురు మృతిచెందారు.

ఏకధాటిగా 15 గంటలపాటు కురిసిన వర్షానికి కొన్నిచోట్ల 12 అడుగుల మేర నీరు నిలిచింది. లోతట్టు ప్రాంతాల్లోని మూడువేల మందికిపైగా ప్రజలను మలేసియా ప్రభుత్వం సురక్షిత ప్రాంతాలకు తరలించింది.
ఆసియా, పసిఫిక్ ఆర్థిక సహకార(ఎపెక్) సదస్సుకు వస్తున్న దేశాధినేతలకు ఆతిథ్యమిచ్చేందుకు సిద్ధమవుతున్న వేళ సంభవించిన ప్రకృతి విపత్తుతో వియత్నాం ప్రభుత్వం అప్రమత్తమైంది. యుద్ధప్రాతిపదికన సహాయ చర్యలు చేపట్టింది.
-
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..! -
Kerala Polls 2026: భారీ పోలింగ్ వెనుక రహస్యం ఇదే..!!












Click it and Unblock the Notifications