ట్రంప్కు ఆఫ్ఘన్వాసుల అవార్డు: అత్యంత ధైర్యవంతుడు
కాబూల్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు అరుదైన అవార్డును ప్రకటించారు. మెడల్ ఆఫ్ బ్రేవరీ అవార్డును ట్రంప్కు ప్రకటించారు. ఉగ్రవాదంపై ద్వంద్వ విధానాలు పాటిస్తున్న పాకిస్థాన్కు వ్యతిరేకంగా ట్రంప్ ఇటీవల కఠిన నిర్ణయం తీసుకోవడంతో ఆయనకు ఈ అవార్డు ప్రకటిస్తున్నట్టు అఫ్గాన్లోని లోగర్ ప్రావిన్స వాసులు తెలిపారు.
బంగారంతో రూపొందించిన ఈ మెడల్పై అఫ్ఘాన్ ప్రజల తరఫున అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఈ శౌర్యపతకం ఇస్తున్నట్టు లోగర్ ప్రాంత నాయకుడు ఫర్హాద్ అక్బరీ తెలిపారు.
645 డాలర్ల వ్యయంతో ఈ మెడల్ను రూపొందించారు. ఒకవైపు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ.. మరోవైపు ఉగ్రవాదంపై పోరులో ఆర్థిక సాయం పొందుతున్న పాక్ తీరును ఖండిస్తూ అమెరికా పాక్కు ఆర్థిక సహయాన్ని నిలిపివేసింది.
ఉగ్రవాదంపై పాక్ వ్యవహరిస్తున్న తీరును అమెరికా తీవ్రంగా తప్పుబట్టింది. ఈ సమయంలోనే అమెరికా వ్యవహరిస్తున్న తీరు భారత్కు అనకూలంగా ఉందని పాకిస్థాన్ అభిప్రాయపడింది.ఈ పరిణామాల నేపథ్యంలో భద్రతా కమిటీ కూడ ఇటీవలనే సమావేశమై తాజా పరిస్థితులపై చర్చించింది..