అమెరికాలో కార్చిచ్చు బీభత్సం.. మంటల్లో 6 రాష్ట్రాలు.. ఎమర్జెన్సీ విధింపు..!
అగ్రరాజ్యం అమెరికాలో కార్చిచ్చు బీభత్సం సృష్టిస్తోంది. కెనడాలో కార్చిచ్చుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అగ్నికీలల ధాటికి ఇద్దరు మృతి చెందారు. మరికొంతమంది ఆస్పత్రి పాలయ్యారు. కార్చిచ్చు కారణంగా అమెరికాలోని ఆరు రాష్ట్రాల్లో గాలి నాణ్యత మరింత క్షీణించిందని అక్కడి అధికారులు పేర్కొన్నారు. విషపూరితమైన గాలి కారణంగా చిన్నారులు, వృద్దులు, మహిళలు తీవ్ర అవస్థలు పడుతున్నట్లు తెలిపారు.
అమెరికాలోని కెనడా ప్రాంతంలో కార్చిచ్చు అంటుకుంది. కార్చిచ్చు అంతకంతకూ వ్యాప్తి చెందుతోంది. ది నేషనల్ వెథర్ సర్వీసెస్ తెలిపిన వివరాల ప్రకారం మిన్నెసోటా, ఇల్లినోయిస్, ఇండియానా, విస్ కాన్సిన్, మిచిగాన్, నెబ్రాస్కా రాష్ట్రాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఈ ప్రాంతాల్లోని చిన్నారులు, వృద్దులు, మహిళలు తీవ్ర అవస్థలు పడుతున్నట్లు స్థానిక అధికారులు తెలిపారు.
కార్చిచ్చుల కారణంగా ఈ ఆరు రాష్ట్రాల్లోని గాలి నాణ్యత మరింత క్షీణించింది. గాలి విషపూరితం అయింది. దీంతో ఈ రాష్ట్రాల ప్రజలకు ప్రభుత్వాలు కీలక ఆదేశాలు జారీ చేశాయి. ఆరు రాష్ట్రాల్లోని ప్రజలు బయటకు రావొద్దని ఆదేశాలు జారీ చేశాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేశారు అధికారులు. కార్చిచ్చుల కారణంగా కెనడాలో ఇద్దరు మృతి చెందారు. ఇప్పటికే వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు స్థానిక అధికారులు.

ఈ ఆరు రాష్ట్రాల్లో బుధవారం నాటికే 33 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే మనిటోబా, సాస్కట్ చీవాన్ ప్రాంతాల్లో ఎమర్జెన్సీ విధించారు. గాలి నాణ్యత మరింత క్షీణించడం కారణంగా ప్రజలు బయటకు వచ్చి ఇబ్బందులు పడొద్దని అధికారులు సూచనలు చేస్తున్నారు. ఈ కలుషితమైన గాలిని పీల్చడం కారణంగా ఊపిరితిత్తుల సమస్యలు వస్తాయని చెబుతున్నారు. అందువల్ల ప్రజలు బయటకు రావొద్దని సూచనలు చేస్తున్నారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు












Click it and Unblock the Notifications