Nimisha Priya: యెమెన్లో కేరళ నర్సు నిమిష ప్రియ ఉరిశిక్ష వాయిదా
Nimisha Priya: యెమెన్లో కేరళ నర్సు నిమిష ప్రియ ఉరిశిక్ష వాయిదా వేసినట్లు సమాచారం అందింది. నిమిష ఉరిశిక్ష అమలు వాయిదా వేస్తూ యెమెన్ కీలక నిర్ణయం తీసుకుంది. నిమిష ప్రియను రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. యెమెన్ ప్రభుత్వంతో భారత సర్కార్ చర్చలు జరుపుతోంది. ఆమెకకు జులై 16న యెమెన్ లో ఉరిశిక్ష అమలు కావాల్సి ఉంది. చివరి క్షణంలో దీనిని నిలిపివేసినట్లు సమాచారం.
చివరి నిమిషంలో బాధిత కుటుంబంతో భారత్ కు చెందిన మత పెద్దల చర్చల నేపథ్యంలో మరణ శిక్ష వాయిదా పడినట్లు సమాచారం. కేరళ నర్సు నిమిష ప్రియ శిక్ష వాయిదా పడ్డ విషయాన్ని యెమెన్లో "సేవ్ నిమిష ప్రియ ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్" సభ్యుడు శామ్యూల్ జోరెమ్ భాస్కరన్ ధ్రువీకరించారు. కానీ బాధిత కుటుంబం బ్లడ్ మనీకి గానీ, శిక్ష రద్దుకు గానీ అంగీకరించలేదని ఆయన వెల్లడించారు. చర్చల్లో ఇంగా పురోగతి రావాల్సి ఉందని పేర్కొన్నారు. కేరళ రాష్ట్రానికి చెందిన గ్రాండ్ ముఫ్తీ ఆఫ్ ఇండియాగా పేరున్న కేరళ ముస్లిం నేత అబుబాకర్ ముస్లియార్, షేఖ్ హబీబ్ ఉమర్ వంటి మత గురువులు రంగంలోకి దిగి క్షమాభిక్ష కోసం రాయబారం జరుపుతున్నారు. తలాల్ అబ్దో మెహదీ కుటుంబంతో మత పెద్దలు యెమెన్ లో అత్యవసర భేటీ అయినట్లు సమాచారం. ఈ క్రమంలో ఉరిశిక్ష వాయిదా పడడం గమనార్హం. మరో వైపు నిమిష ప్రియ విషయంలో భారత ప్రభుత్వం ప్రయత్నాలు కూడా ఫలిస్తున్నట్లు తెలుస్తోంది.
నిమిష ప్రియకు హత్య కేసులో మరణ శిక్ష విధించబడిన సంగతి తెలిసిందే. ఆమె 2017 నుంచి యెమెన్ జైలులో ఉన్నారు. మెమెనీ పౌరుడు తలాల్ అబ్టో మెహదీ హత్యకు నిమిష దోషిగా తేలింది. మెహదీ వద్ద తన పాస్పోర్టును పొందడానికి ఆయనకు మత్తు ఇంజెక్షన్లు ఇచ్చిందని ఆమెపై ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ ఇంజెక్షన్ల డోస్ ఎక్కువ కావడంతో మెహదీ మరణించారు.

కేరళలోని పాలక్కాడ్ కు చెందిన నర్సు నిమిషా తన భర్త మరియు కూతురితో కలిసి గత దశాబ్ద కాలంగా యెమెన్లో పని చేస్తున్నారు. 2016లో యెమెన్లో జరిగిన అంతర్యుద్ధం కారణంగా దేశం నుండి రాకపోకలపై ఆంక్షలు విధించారు. అయితే, అంతకుముందు 2014లోనే ఆమె భర్త, కూతురు భారత్కు తిరిగి వచ్చేశారు.కానీ నిమిష ప్రియ తిరిగి రాలేకపోయింది. ఆ తర్వాత జూలై 2017లో ఒక యెమెనీ పౌరుడి హత్య కేసులో ఈ నర్సుపై అభియోగాలు మోపారు. 2018 మార్చి 7న యెమెన్లోని న్యాయస్థానం నిమిషా మరణశిక్షను సమర్థించింది.
ఏ చట్టం కింద నిమిష ప్రియకు శిక్ష విధించబడింది?
యెమెన్లో షరియా చట్టం అమలవుతుంది. ఈ చట్టం కింద హత్య కేసులలో మరణశిక్ష విధించబడుతుంది. బ్లడ్ మనీ అనేది ఒక పద్ధతి, దీనిలో హత్య చేసిన వ్యక్తికి క్షమాపణ ఇవ్వబడుతుంది. అయితే ఆ వ్యక్తి మృతుని కుటుంబానికి పరిహారంగా పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించాలి. ఈ మొత్తం మృతుని బంధువులతో ఒప్పందం ద్వారా నిర్ణయించబడుతుంది.నిమిష ప్రియకు యెమెన్లో మరణశిక్ష విధించినప్పటి నుండి, బ్లడ్ మనీ చెల్లించి ఆమెను విడిపించే విషయం చర్చలో ఉంది. ఇస్లాం పండితులు ఈ పద్ధతిని క్షమించడానికి అవకాశాన్ని మాత్రమే కాకుండా, ఆర్థిక మద్దతు ద్వారా బాధితుడి కుటుంబానికి కొంతవరకు న్యాయం కూడా చేస్తుందని నమ్ముతారు.
-
3 ప్రభుత్వ బ్యాంకులకు ఆర్బీఐ షాక్.. రూల్స్ బ్రేక్ చేస్తే ఊరుకునేదే లేదంటూ !! -
పెరుగులో ఉప్పు లేదా చక్కెర - ఆరోగ్యానికి ఎవరికి ఏది మంచిది..!! -
దివ్యాంగుల ప్రతిభకు పట్టం: రూ. 5 లక్షలు గెలుచుకునే ఛాన్స్.. అప్లై చేసుకోండిలా! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్












Click it and Unblock the Notifications