కల్వకుంట్ల కామెంట్స్ కలకలం: సాగర్ రావు దిష్టిబొమ్మ దగ్ధం, కేసీఆర్ది కూడా.. ఆందోళనలు
కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు అయోధ్య రామాలయంపై చేసిన వ్యాఖ్యలు అగ్గిరాజేశాయి. ఎమ్మెల్యే తీరును నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. జగిత్యాల జిల్లాలో బీజేపీ నేతలు నిరసన తెలిపారు. రాయికల్ మండల కేంద్రంలో రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
Recommended Video


దిష్టిబొమ్మ దహనం..
ఇటు ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. సీఎం వేంటనే హిందువులకు క్షమాపణలు చెప్పాలని సత్తుపల్లి మండలం, పట్టణం పార్టీ అధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సత్తుపల్లి రింగ్ రోడ్ కూడలిలో సత్తుపల్లి మండల అధ్యక్షుడు పాలకొల్లు శ్రీనివాస్, పట్టణ ప్రధాన కార్యదర్శి జోన్నల గడ్డ నరేష్ తదితరులు కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు.

మనోభావాలు దెబ్బతీస్తున్నారని..
కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు హిందువుల మనోభావాలు దెబ్బతినేలా కామెంట్ చేశారని జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా శ్యామ్ సుందర్, జిల్లా కార్యదర్శి సుదర్శన్ మిశ్రా అన్నారు. అయోధ్యలో నిర్మిస్తోన్న రామ మందిరానికి విరాళాలు ఇవ్వొద్దని.. బీబీజేకి వాళ్ళు బిక్షం ఎత్తుకొంటున్నారని కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. ఇంతకీ విద్యాసాగర్ రావు అసలు హిందువేనా అని ప్రశ్నించారు.

మహానుభావుల కృషి..
అయోధ్యలో రామ మందిరం నిర్మాణం వెనుక ఎందరో మహానుభావులు ఉన్నారని తెలిపారు. లక్షల మంది బలిదానాలు చేయడం వల్లే అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరగుతుందన్నారు. హిందువుల కల సాకారం అవుతోన్న వేళ.. వివాదాస్పద కామెంట్స్ చేయడం సరికాదన్నారు. రామ మందిర నిర్మాణం హిందువుగా ప్రతి ఒక్కరు గర్వించదగ్గ విషయమని అన్నారు.

వివాదానికి అజ్యం ఇలా..?
అయోధ్య రామాలయానికి నిధులు ఎందుకు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలు అగ్గిరాజేశాయి. రామ భక్తులు, హిందూ సంఘాల నేతలు ఒంటికాలిపై లేస్తున్నారు. యూపీలో రామాలయానికి విరాళాలు ఇవ్వొద్దు అని సాగర్ రావు కోరారు. ఉత్తరప్రదేశ్ రాముడు మనకెందుకు అంటూ హాట్ కామెంట్స్ చేశారు. మన వద్ద రాముడి ఆలయాలు లేవా అంటూ కొత్త వివాదానికి తెరలేపారు. ఇక్కడ ఉన్న ఆలయాలకు విరాళాలు ఇవ్వాలని కోరారు. రాముని పేరు మీద కొందరు భిక్షం ఎత్తుకుంటున్నారని సాగర్ రావు వ్యాఖ్యలు చేశారు. కొత్త నాటాకనికి తెర లేపుతున్నారని బీజేపీపై విమర్శలు చేశారు. బొట్టు పెట్టుకుంటేనే రాముని భక్తులమా అని అడిగారు. తామంతా శ్రీరాముని భక్తులమేనని వ్యాఖ్యానించారు. భక్తి అనేది మనసులో ఉండాలని సూచించారు. ఎమ్మెల్యే కామెంట్స్ నిరసిస్తూ బీజేపీ/ హిందూ సంస్థలు ఆందోళనకు దిగాయి.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications