సర్పంచ్ సీటులో సీఎం జగన్.. ఫోటోలకు ఫోజులు
నేతలు ఏం చేసినా సంచలనమే.. పర్యటన సందర్భంగా.. అప్పుడప్పుడు సరదగా పనులు చేస్తుంటారు. ఇందుకు సీఎంలు అతీతులు కారు.. కానీ వారు ఏం చేసినా సంచలనమే.. ఏపీ సీఎం జగన్ కూడా ఇందులోకి వస్తారు. ఆయన ఎప్పుడూ జనంలో మమేకం అవుతారు. ఇందులో సందేహాం లేదు. ఎప్పుడూ ఏదో టూర్ చేస్తుంటారు సీఎం జగన్.
సొంత జిల్లా కడప జిల్లా పర్యటనకు జగన్ వెళ్లారు. సొంత నియోజకవర్గం పులివెందులలో పర్యటించారు. నియోజకవర్గ పరిధిలోని వేముల మండలం వేల్పులలో కొత్తగా నిర్మించిన సచివాలయ భవన సముదాయాన్ని ప్రారంభించారు. సచివాలయాన్ని ప్రారంభించిన తర్వాత భవనంలోని గదులను పరిశీలించారు. సర్పంచ్కు కేటాయించిన గదిలోకి వెళ్లారు.

గ్రామ సర్పంచ్ నిర్మలను వెంటబెట్టుకుని సర్పంచ్ సీటు వద్దకు వెళ్లారు. సర్పంచ్ సీట్లో కూర్చుని ఫొటోలకు పోజిచ్చారు. తన వెంట వచ్చిన సర్పంచ్ నిర్మలను కూడా తన పక్కన నిలబెట్టుకుని ఫొటోలు దిగారు. ఈ ఫొటోను వైసీపీ సోషల్ మీడియా ఇంచార్జీ, ఏపీ ఫారెస్ట్ కార్పొరేషన్ చైర్మన్ గుర్రంపాటి దేవేంద్రరెడ్డి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
తన పర బేధం లేకుండా సామాన్యుని సైతం అక్కున చేర్చుకునే వ్యక్తిత్వం జగనన్న సొంతం.. సీఎం స్థానంలో ఉన్న మహోన్నత వ్యక్తి.. తనను నమ్ముకున్న సామాన్య సర్పంచ్ని పక్కన పెట్టుకుని ఫోటో దిగడం రాజకీయ చరిత్రలోనే ఇప్పటిదాకా చూసి ఉండరు అంటూ రాసుకొచ్చారు.
-
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం












Click it and Unblock the Notifications