బీజేపీ అధికారంలోకి వచ్చాక ఆ రెండూ ఉచితమే: బండి సంజయ్, కేసీఆర్ దిమ్మదిరుగుతోందని ఈటల
కరీంనగర్: గడీల పాలనను భారతీయ జనతా పార్టీ అంతం చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామయాత్ర మొదటి విడత హుస్నాబాద్లో శనివారం సాయంత్రం ముగిసింది. ఈ సందర్భంగా భారీ సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు కేంద్రమంత్రి స్మృతి ఇరానీ హాజరయ్యారు. ఈ సభలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఈటల గెలుపును ఆపలేరు.. ధర్మం కోసం పోరాటమేనంటూ బండి
ప్రజా సంగ్రామ యాత్ర ఇకపై కూడా కొనసాగుతుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో అమలయ్యే ప్రతి పథకానికి కేంద్రం నుంచి నిధులు వస్తున్నాయన్నారు. కానీ, ఈ ప్రభుత్వం అన్ని కుల వృత్తులను దెబ్బతీసింది. హుజూరాబాద్లో ఈటల రాజేందర్ విజయాన్ని టీఆర్ఎస్ అడ్డుకోలేదని స్పష్టం చేశారు. తాను హిందుత్వం గురించి మాట్లాడితే తప్పా? అని ప్రశ్నించారు బండి సంజయ్. రాష్ట్రంలో హిందువుల పరిస్తితి ఏమిటో అందరికీ తెలిసిందేనన్నారు. 80 శాతం ఉన్న హిందువుల గురించి మాట్లాడవద్దా? అని ప్రశ్నించారు. బీజేపీ, బండి సంజయ్ హిందూ ధర్మం కోసమే పోరాడుతుందన్నారు. రామరాజ్యం కావాలో.. తాలిబన్ల రాజ్యం కావాలో తేల్చుకోవాలని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.

బీజేపీ అధికారంలోకి వస్తే ఉచిత విద్య, వైద్యం: బండి సంజయ్
ఇది బీజేపీ స్వాగత సభ అని, బీజేపీ అధికారంలోకి వస్తే ఉచిత వైద్యం, విద్య విషయంలో మొదటి సంతకం చేస్తామని అన్నారు బండి సంజయ్. 2023లో బీజేపీ అధికారంలోకి వస్తుందని, అందరికీ ఉచితంగా వైద్యం అందిస్తామని, స్కూళ్లను అభివృద్ధి చేస్తామని బండి సంజయ్ తెలిపారు. 36 రోజులపాటు, 348 కిమీ మేర పాదయాత్ర చేసినట్టు ఆయన పేర్కొన్నారు. లక్షల కోట్లతో ప్రాజెక్టులు ఎవరికోసం కడుతున్నారని, పాదయాత్రలో ఎవర్ని అడిగినా ఒక్క చుక్కనీరు కూడా రాలేదని చెబుతున్నారని మండిపడ్డారు. వరి వేస్తే ఉరి ఎందుకు అని బండి సంజయ్ ప్రశ్నించారు.

బండి సంజయ్ సీఎం సీఎం అంటూ అభిమానుల నినాదాలు
సంజయ్ మాట్లాడుతుండగా.. కార్యకర్తలందరూ సీఎం.. సీఎం అంటూ అరుస్తుండటంతో ఆయన కలగచేసుకొని మాట్లాడారు. ఈ యాత్ర చేసేది సీఎం కావడానికి కాదు.. వేరేవాళ్లను సీఎంలను చేస్తాం అని సంజయ్ అన్నారు. ఈ సభ టీఆర్ఎస్ కు వీడ్కోలు సభ అని .. బీజేపీ మాత్రం స్వాగత సభ అని ఆయన అన్నారు. ముగింపు సభలో కేంద్రమంత్రి స్మృతీ ఇరానీతోపాటు బీజేపీ నేతలు లక్ష్మణ్, ఈటల రాజేందర్, తదితరులు పాల్గొన్నారు. సభకు బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అక్టోబర్ 30వ తేదీన హుజురాబాద్కు ఉప ఎన్నిక జరగబోతున్న నేపథ్యంలో ఈ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం గమనార్హం. హుజురాబాద్లో తప్పకుండా గెలుస్తామని ఈటలతో పాటుగా బీజేపీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
హుజూరాబాద్ నివేదికలతో కేసీఆర్ దిమ్మదిరుగుతోంది..
బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ నిర్వహించిన మొదటి దశ 'ప్రజా సంగ్రామ యాత్ర' ముగింపు సభలో బీజేపీ నేత ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. హుజురాబాద్లో అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావడం లేదని.. కేసీఆర్ రాజ్యాంగం మాత్రమే అమలవుతోందని అన్నారు. ఐదు నెలలుగా హుజురాబాద్లో మద్యం ఏరులై పారుతోందని ఆయన అన్నారు. ఆగస్ట్ 28న భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం నుంచి మొదలైన 'ప్రజా సంగ్రామ యాత్ర' 36 రోజులపాటు కొనసాగి.. ఈ రోజు హుస్నాబాద్లో విజయవంతంగా ముగిసింది. పాదయాత్ర చేసిన కార్యకర్తలందరికీ నా అభినందనలు. హుజురాబాద్లో నన్ను ఓడించేందుకు కోట్లు ఖర్చు చేస్తున్నారు. ప్రగతి భవన్లో కూర్చుని కేసీఆర్ ఆదేశాలు ఇస్తుంటే... కొంతమంది అమలు చేస్తున్నారు. అక్టోబర్ 30న జరిగే కురుక్షేత్ర యుద్ధంలో ధర్మమే గెలుస్తుంది. హుజురాబాద్లో కేసీఆర్ అహంకారానికి, తెలంగాణ ఆత్మగౌరవానికి మధ్య పోరాటం జరుగుతోంది. హుజురాబాద్ ప్రజానీకం అంతా నన్ను గెలిపించాలని కోరుకుంటున్నారు. హుజురాబాద్లో 75% బీజేపీకి, టీఆర్ఎస్కి 25% మాత్రమే గెలుపు అవకాశాలు ఉన్నాయని నివేదికలు చెప్తుంటే... కేసీఆర్కి దిమ్మ తిరుగుతోంది. ఎన్ని దొంగ లెటర్స్ సృష్టించినా... అది వాళ్ళకే తిప్పి కొడుతుంది. నాలాంటి బక్క పలుచని ఉద్యమకారుడిని కొట్టాలని చూస్తే... అయ్యే పనేనా?. హుజురాబాద్ కురుక్షేత్రంలో గెలిచాక... ఆ తర్వాత 33 జిల్లాల్లో కురుక్షేత్రమే. 'దళిత బంధు'ను 33 జిల్లాలకు అమలు చేయాలని కేసీఆర్ను డిమాండ్ చేస్తున్నా. అన్ని కులాల్లోని పేదలకు ఈ పథకాన్ని అమలు చేయాలి. బీజేపీని గెలిపించేందుకు 33 జిల్లాల ప్రజలు ఎదురు చూస్తున్నారు అని ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు.
-
కేంద్రానికి కవిత షాకింగ్ అల్టిమేటం.. ఆ విషయంలో పోరాటమే! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్..












Click it and Unblock the Notifications