ఏపీలో వర్ష బీభత్సం: రోడ్డుపై చేపలు వదిలిన టీడీపీ నేత..
ఏపీలోనూ వర్ష బీభత్సం కొనసాగుతోంది. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చాలా చోట్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. జనం ఇబ్బంది పడుతున్నారు. వెంటనే సహాయ చర్యలు చేపట్టాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. పలు చోట్ల రోడ్ల పరిస్థితి అంతగా బాగోలేదు. భారీ గుంతలు ఏర్పడి, నీళ్లు నిలిచిపోయాయి. దీంతో జనం ఇబ్బంది అంతా ఇంత కాదు.
కైకలూరు నియోజకవర్గంలో రోడ్లు చేపల చెరువుల్లా మారాయి. టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ నిరసన చేపట్టారు. టీడీపీ కార్యకర్తలతో కలిసి ఆయన కైకలూరు నియోజకవర్గంలోని ఓ రోడ్డుపై నీరు నిలిచిన గుంతల్లో చేప పిల్లలను వదిలి వినూత్న తరహాలో నిరసన తెలియజేశారు. టీడీపీ శ్రేణులు నినాదాలు చేశాయి. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో ట్రోల్ అవుతుంది.

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మంగళవారం తీవ్ర రూపం దాల్చింది. చత్తీస్ఘడ్ ప్రాంతాలలో కేంద్రీకృతమై ఉండటంతోపాటు ఉపరితల ఆవర్తనం కూడా చురుగ్గా కదులుతుంది. మరో మూడు రోజులు పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితిని బట్టి మరో 3 రోజులు వర్షాలు పడే అవకాశం ఉంది. వర్షం వల్ల వరదనీరు నిల్వడం వల్ల దోమలు ఎక్కువ అవుతాయి. దీని వల్ల జ్వరాల బారిన పడే అవకాశం ఉంటుంది. ఆహారం కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. లేదంటే మలేరియా, టైపాయిడ్, వైరల్ జ్వరాలు వ్యాపించే అవకాశాలు ఉన్నాయి.
►కైకలూరు నియోజకవర్గంలోని రోడ్ల పరిస్థితి చేపల చెరువులాగా ఉన్నాయని.. నిరసనగా రోడ్లు పై చేప పిల్లలను వదిలిన మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ మరియు తెలుగుదేశం నాయకులు.@JaiTDP pic.twitter.com/k3OuOzZPE6
— DD News Andhra (అధికారిక ఖాతా) (@DDNewsAndhra) July 12, 2022
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు!












Click it and Unblock the Notifications