శ్రీశైలం విద్యుత్ ప్లాంట్ వద్ద ప్రమాదం.. ఒకరి మృతి.. మరొకరికి తీవ్రంగా గాయాలు..
శ్రీశైలం విద్యుత్ ప్లాంట్ వద్ద ప్రమాదం జరిగింది. కారు బ్రేకులు ఫెయిలవటంతో ఒకరు చనిపోగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డాడు. శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్ ప్లాంట్లో శుక్రవారం ఈ ఘటన జరిగింది. విద్యుత్ ప్లాంట్లో కేబుల్ మరమ్మతు పనులు జరుగుతున్నాయి. అక్కడ పని చేస్తున్న కార్మికులను తీసుకెళ్లేందుకు కాంట్రాక్ట్ లేబర్ శివలింగం అద్దె కారులో, డ్రైవర్ మనోజ్తో కలిసి ప్లాంట్ లోపలికి బయల్దేరాడు.
కారులో లోపలకు వెళుతుండగా కారు బ్రేకులు ఫెయిలయ్యాయి. ప్లాంట్ అంతర్భాగం లోకి వెళ్లే ఈ మార్గం మొత్తం ఏటవాలుగా ఉండటంతో కారు వేగంగా దూసుకెళ్లి సర్వీస్ బే వద్ద ఉన్న స్పైర్ రన్నర్ ను ఢీకొట్టింది. డ్రైవర్ పక్కన కూర్చున్న శివలింగం తీవ్రంగా గాయపడి ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. డ్రైవర్ మనోజ్కు తీవ్రగాయాలు కావడంతో అతనిని చికిత్స కోసం ఈగలపెంట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తీసుకెళ్లారు.

Recommended Video
ఏటవాలుగా ఉన్న మార్గంలో స్పీడ్ గా దూసుకు వచ్చిన వాహనం స్పైర్ రన్నర్ను ఢీకొట్టటంతో భారీ శబ్దం వచ్చింది. ఆ శబ్దానికి ప్లాంటులోని కార్మికులు అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కారు ముందుభాగం నుజ్జునుజ్జయ్యింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications