శ్రీశైలం విద్యుత్ ప్లాంట్ వద్ద ప్రమాదం.. ఒకరి మృతి.. మరొకరికి తీవ్రంగా గాయాలు..

శ్రీశైలం విద్యుత్ ప్లాంట్ వద్ద ప్రమాదం జరిగింది. కారు బ్రేకులు ఫెయిలవటంతో ఒకరు చనిపోగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డాడు. శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్ ప్లాంట్‌లో శుక్రవారం ఈ ఘటన జరిగింది. విద్యుత్‌ ప్లాంట్‌లో కేబుల్‌ మరమ్మతు పనులు జరుగుతున్నాయి. అక్కడ పని చేస్తున్న కార్మికులను తీసుకెళ్లేందుకు కాంట్రాక్ట్‌ లేబర్‌ శివలింగం అద్దె కారులో, డ్రైవర్‌ మనోజ్‌తో కలిసి ప్లాంట్ లోపలికి బయల్దేరాడు.

కారులో లోపలకు వెళుతుండగా కారు బ్రేకులు ఫెయిలయ్యాయి. ప్లాంట్ అంతర్భాగం లోకి వెళ్లే ఈ మార్గం మొత్తం ఏటవాలుగా ఉండటంతో కారు వేగంగా దూసుకెళ్లి సర్వీస్ బే వద్ద ఉన్న స్పైర్ రన్నర్ ను ఢీకొట్టింది. డ్రైవర్‌ పక్కన కూర్చున్న శివలింగం తీవ్రంగా గాయపడి ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. డ్రైవర్‌ మనోజ్‌కు తీవ్రగాయాలు కావడంతో అతనిని చికిత్స కోసం ఈగలపెంట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తీసుకెళ్లారు.

man died in car accident at srisailam power plant

Recommended Video

    Niti Aayog On Covid Vaccination Drive పారదర్శక పద్ధతిలోనే రాష్ట్రాలకు వ్యాక్సిన్ డోసులు!

    ఏటవాలుగా ఉన్న మార్గంలో స్పీడ్ గా దూసుకు వచ్చిన వాహనం స్పైర్‌ రన్నర్‌ను ఢీకొట్టటంతో భారీ శబ్దం వచ్చింది. ఆ శబ్దానికి ప్లాంటులోని కార్మికులు అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కారు ముందుభాగం నుజ్జునుజ్జయ్యింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+