మహబూబాబాద్లో వింత వ్యాధి: 130 మందికి తీవ్ర అస్వస్థత..
అసలే కరోనా వైరస్.. కొత్త రకం స్ట్రెయిన్తో ఆందోళన నెలకొంది. చలి తీవ్రత పెరగడంతో సీజనల్ వ్యాధుల టెన్షన్ కూడా ఉంది. ఇంతలా ఉత్కంఠ నెలకొంటే మహబూబా బాద్లో అంతుచిక్కని వ్యాధి కలకలం రేపుతోంది. వ్యాధి గురించి తెలియరాలేదు. కానీ వందకు పైగా మంది మాత్రం అస్వస్థతకు గురయ్యారు. వెంటనే గ్రామంలోకి వైద్య సిబ్బంది చేరుకొని.. వారిని పరీక్షిస్తున్నారు.
అంతుచిక్కని వ్యాధి కలకలం రేపుతోంది. అయోధ్య శివారు భజన తండాలో వింత వ్యాధి జడలువిప్పి నాట్యం చేస్తోంది. వింత వ్యాధితో గత వారం రోజుల నుంచి గ్రామస్తులు బాధపడుతున్నారు. వాంతులు, విరేచనాలతో దాదాపు 130 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరికి చికిత్స అందిస్తున్నారు. ఒక్కసారిగా ఇంతమంది అస్వస్థతకు గురవడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.

జిల్లా వైద్యాధికారులు గ్రామంలో వైద్య శిబిరం కూడా ఏర్పాటు చేశారు. ప్రజలకు దగ్గరుండి మరీ వైద్యం అందిస్తున్నారు. వ్యాధికి గల కారణాలు తెలియరాలేదు. తండాలో గల నీరు, ఆహారం శాంపిల్స్ను వైద్యాధికారులు ల్యాబ్కు పంపించారు. రిపోర్ట్ తర్వాత ఏం జరిగిందో తెలియనుంది. అనారోగ్యంతో ఉన్న బాధితులను ఎమ్మెల్యే శంకర్ నాయక్ పరామర్శించారు. బాధితులకు మెరుగైన చికిత్స అందిస్తామని ఆయన తెలిపారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications