బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎంతపని చేశారు..!!

మంచిర్యాల్: తెలంగాణలో అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితికి చెందిన మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి శాసనసభ్యుడు దుర్గం చిన్నయ్య వివాదాల్లో చిక్కుకున్నారు. ఆయన చేసిన పనిని జాతీయ మీడియా సైతం హైలైట్ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ ఘటనపై పోలీసులు సైతం విచారణ మొదలు పెట్టారు. ఆయనపై ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదు. ఫిర్యాదులు అందిన వెంటనే కేసు నమోదు చేస్తామని పోలీసులు పేర్కొన్నారు.

మందమర్రి టోల్ ప్లాజా సిబ్బందిపై ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య దాడికి దిగారు. ఓ ఉద్యోగి చెంప పగులగొట్టారు. తన కారును అడ్డుకోవడమే దీనికి కారణమని తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి బెల్లంపల్లికి వెళ్తోన్న సమయంలో మార్గమధ్యలో మందమర్రి టోల్ ప్లాజా వద్ద ఆయన కారును అక్కడి సిబ్బంది అడ్డుకున్నారు.

BRS MLA Durgam Chinnaiah allegedly assaults a employ of toll plaza at Mandamarri

టోల్ అమౌంట్ ను వసూలు చేయడానికి వారు ఆయన కారును ఆపడంతో దుర్గం చిన్నయ్య ఆగ్రహోదగ్రుడయ్యారు. కారు దిగి నేరుగా టోల్ బూత్ వద్దకు నడుచుకుంటూ వెళ్లారు. సిబ్బందితో గొడవ పడ్డారు. ఓ ఉద్యోగి చెంప పగులగొట్టారు. ఆయన అనుచరులు వారిస్తున్నప్పటికీ వినిపించుకోలేదు. వెనక్కి తీసుకెళ్లడానికి ప్రయత్నించినా పట్టించుకోలేదు. టోల్ ప్లాజా సిబ్బందిపై బెదిరింపులకు దిగారు. ఈ వ్యవహారం అంతా టోల్ ప్లాజా వద్ద అమర్చిన సీసీటీవీ ఫుటేజీల్లో రికార్డయింది.

ఈ ఘటనపై మందమర్రి పోలీసులు స్పందించారు. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మీద ఇప్పటివరకు తమకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదని పేర్కొన్నారు. టోల్ ప్లాజా వద్ద గొడవ జరిగిన విషయం, ఎమ్మెల్యే- అక్కడి సిబ్బందిపై దాడికి దిగినట్లు సమాచారం అందిందని చెప్పారు. ఈ ఘటనపై ఇప్పటివరకు ఎవరూ ఫిర్యాదు చేయలేదని వివరించారు. దీనిపై విచారణ జరుపుతున్నామని, ఫిర్యాదులు అందితే కేసు నమోదు చేస్తామని మందమర్రి పోలీసులు స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+