గో బ్యాక్ కేసీఆర్, అల్లుడు-కూతురి కోసం దొంగిలించి ఎలా వచ్చావ్: నిరసన సెగ (వీడియో)
ఆందోల్/మెదక్: ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఆందోల్ నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు నిరసన సెగ తగిలింది. చాలామంది ద్విచక్ర వాహనాల పైన కేసీఆర్కు, తెరాసకు వ్యతిరేకంగా ప్లకార్డులు పట్టుకొని బయలుదేరారు. కేసీఆర్ డౌన్ డౌన్.. రైతుల ఐక్యత వర్ధిల్లాలి అని వారు నినాదాలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు ఈ ర్యాలీ తీసినట్లుగా ఉంది.
ఆ తర్వాత వారంతా కలిసి రోడ్డుపై బైఠాయించారు. కేసీఆర్ గో బ్యాక్, వీ వాంట్ జస్టిస్ అని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సింగూరు జలాల అక్రమ తరలింపును వెంటనే ఆపాలని వారు డిమాండ్ చేశారు. ఎత్తిపోతల పథకాలను వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. మా నీళ్లు మాకు కావాలని సింగూరు జలాలపై నినాదాలు చేశారు. అనంతరం వారు మాట్లాడారు.

అల్లుడు, కూతురు, కొడుకు కోసం అక్రమంగా తరలింపు
సింగూర్ నీళ్లు మా తలాపున ఉన్నాయని, దీని కోసం ఆందోల్ ప్రాంత రైతులు తమ భూములు కోల్పోయి నష్టపోయారని వారు చెప్పారు. మా ప్రాంతంలో పారుతున్న ఈ సింగూరు నీరును తమ ప్రాంతానికి ఇవ్వకుండా వాళ్ల కొడుకు కేటీఆర్, బిడ్డ కవిత, అల్లుడు హరీష్ రావులతో పాటు తన కోసం, ఓట్ల లబ్ధి కోసం అక్రమంగా తరలిస్తున్నారని ఆరోపించారు. తమ ప్రాంతంలోని నీరును ఇతర నియోజకవర్గాలకు ఎత్తుకెళ్లడం సరికాదన్నారు. తమ ప్రాంతాన్ని ఎడారిగా మార్చారన్నారు.

మళ్లీ ఓట్లు అడిగేందుకు ఎలా వచ్చావ్
గతంలో కేసీఆర్ ఆందోల్ కట్ట పైన కూర్చీ వేసుకొని కూర్చోని, ఈ నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు నీరు అందిస్తామని చెప్పారని వారు చెప్పారు. కానీ ఈ రోజు మళ్లీ ఓట్లు అడిగేందుకు వచ్చారని, ఆయన ఏ ముఖం పెట్టుకొని వచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. తమకు చుక్కనీరు ఇవ్వకపోగా, మా సింగూరు నీరును దొంగిలించి, మా ప్రాంతాన్ని ఎడారిగా మారుస్తావా అని మండిపడ్డారు. ఇప్పుడు మళ్లీ ఓట్లు అడిగేందుకు ఎలా వచ్చావని ప్రశ్నించారు.

ఏ ముఖం పెట్టుకొని వచ్చావ్
లక్ష ఎకరాలకు నీరు ఇస్తానని కేసీఆర్ చెప్పారని, కానీ అది నెవవేరలేదని మరొకరు అన్నారు. ఆ దొర కేసీఆర్ ఏ ముఖం పెట్టుకొని మళ్లీ ఓట్లు అడిగేందుకు వస్తున్నారని ప్రశ్నించారు. మీ కూతురు, అల్లుడు, కొడుకు కోసం వారి నియోజకవర్గాలకు 17 టీఎంసీల నీరును తీసుకెళ్లి, మా రైతుల నోట్లో మట్టి కొట్టావని మండిపడ్డారు. దీనికి కేసీఆర్ మూల్యం చెల్లించికోవాలన్నారు. ఇక్కడి ప్రజలు కేసీఆర్కు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.
కేసీఆర్ గో బ్యాక్
ఈ రోజు ఆందోల్ సభకు రూ.500 నుంచి రూ.1000 ఇచ్చి తీసుకు వెళ్తున్నారని, డబ్బులు తీసుకొని ప్రజలు వెళ్లవచ్చునని, కానీ ఓట్లు మాత్రం నిజాయితీగా కాంగ్రెస్ పార్టీకి వేయాలని వారు అన్నారు. కేసీఆర్ దుర్మార్గమైన చర్యకు పాల్పడుతున్నారని, అందుకే ఆయనను గో బ్యాక్ అంటున్నామని, ఆయన మళ్లీ రావొద్దన్నారు. అనంతరం పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
-
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్లోని క్రేన్కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్ -
తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!! -
కివీసీ ప్లేయర్ కన్నీటి పర్యంతం, ఓడినందుకు కాదు - ఇండియన్ వైబ్రేషన్స్ తో ఒక్కసారిగా..!! -
Kavuri Sambasiva Rao: కావూరి సాంబశివరావు మృతి వార్తలు ? క్లారిటీ ఇదే..! -
పాకిస్తాన్ కు ఐసీసీ భారీ నగదు బహుమతి! ఎన్ని కోట్లంటే..!












Click it and Unblock the Notifications