ఘోర రోడ్డు ప్రమాదం: గాల్లో ఎగిరి కాల్వలో పడిన కారు, ఏడుగురు మృతి
మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శివ్వంపేట మండలం ఉసిరికపల్లి వద్ద బుధవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వెళుతున్న కారు అదుపుతప్పి కాల్వలోకి దూసుకెళ్లింది. దీంతో ఏడుగురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు, ముగ్గురు పిల్లలు, ఓ వ్యక్తి ఉన్నారు. వీరంతా పాముబండ తండాకు చెందినవారిగా గుర్తించారు.
రహదారిపై గుంతల వల్ల కారు అదుపుతప్పి కల్వర్టును ఢీకొంది. ఆ తర్వాత గాల్లోకి ఎగిరి పక్కనే ఉన్న కాల్వలో పడింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఏడుగురు నీటమునిగి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

కెమికల్ సంపులో పడి కవలలు మృతి
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ పరిధిలోని జీడిమెట్ల పారిశ్రామికవాడలో తీవ్ర విషాదం నెలకొంది. కంపెనీలో పనిచేసేందుకు వచ్చి కవలలు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. జీడిమెట్ల పారిశ్రామికవాడలోని ఓ కంపెనీలో రెనోవేషన్ పనులు జరుగుతున్నాయి. కవలలైన అన్నదమ్ములు రాము, లక్ష్మణ్ కంపెనీలో ఫ్యాబ్రికేషన్ వర్క్ చేస్తున్నారు. ప్రమాదవశాత్తు లక్ష్మణ్ కెమికల్ సంపులో పడిపోయాడు. గమనించిన రాము వెంటనే తమ్ముడిని కాపాడేందుకు ప్రయత్నం చేశాడు.

ఈ క్రమంలో రాము కూడా కెమికల్ సంపులో పడిపోవడంతో ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు ఆరా తీశారు. షాపూర్నగర్లోని రామ్ రాజ్ ఆస్పత్రికి మృతదేహాలు తరలించారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని జీడిమెట్ల పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అన్నదమ్ములు ఒకేసారి మరణించడంతో వారి తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
-
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications