ఐటీ రైడ్స్: మంత్రి జగదీశ్ పీఏ ఇంట్లో, భారీగా నగదు
మునుగోడు బై పోల్ ప్రచార పర్వం తుది దశకు చేరింది. రేపు సాయంత్రంతో క్యాంపెయిన్ ముగియనుండగా.. ఈసీ ఇప్పటికే ఏర్పాట్లు చేసింది. అయితే బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పీఏ డ్రైవర్ భారీ నగదుతో పట్టుబడ్డ సంగతి తెలిసిందే. ఇటు వెంటనే ఐటీ సోదాలు కూడా జరిగాయి. మునుగోడు బై పోల్కు సంబంధించి మంత్రి జగదీశ్ రెడ్డి సహచరుల వద్ద రైడ్ జరిగింది.

జగదీశ్ పీఏ ఇంట్లో
మంత్రి జగదీశ్ రెడ్డి పీఏ ప్రభాకర్ రెడ్డి ఇంటిపై ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేశారు. నల్లగొండలో గల ప్రభాకర్ రెడ్డి ఇంటికి ఐటీ అధికారుల బృందం చేరుకుంది.. అక్కడ సోదాలు చేస్తున్నారు. భారీగా నగదు ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్ తెలుస్తోంది. ఎంత మొత్తం అనే విషయం తెలియరాలేదు.

అన్నీ తానై చూస్తుండగా..
మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికను టీఆర్ఎస్ హై కమాండ్ జగదీశ్ రెడ్డికి అప్పగించిన సంగతి తెలిసిందే. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారాన్ని మొత్తం తన భుజాలపై వేసుకున్నారు. అయితే రెండు రోజుల క్రితం ఎన్నికల నిబంధనలను జగదీశ్ రెడ్డి అతిక్రమించారని కేంద్ర ఎన్నికల సంఘం నుంచి నోటీసులు జారీ అయ్యాయి. ఆ విషయం అలా ఉండగా ఆయన పీఏ ఇంటిపై ఐటీ అధికారులు దాడులు చేశారు.

48 గంటలు బ్యాన్.. ఆ తర్వాత
ఇటీవల మంత్రి జగదీశ్ రెడ్డి చేసిన కామెంట్స్ ఆయనపై చర్యలు తీసుకునేందుకు కారణమైంది. మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఓటేయకపోతే ప్రభుత్వ పథకాలు అందవని ఆయన కామెంట్ చేశారు. దీనిపై ఎన్నికల సంఘం నోటీసులు ఇచ్చింది. ఈ నోటీసులపై మంత్రి జగదీశ్ రెడ్డి వివరణ ఇచ్చారు. మంత్రి వివరణపై ఎన్నికల సంఘం అసంతృప్తి చెందింది. ఎన్నికకు సంబంధించి ఆయనపై ఆంక్షలు విధించింది. 48 గంటల పాటు సభలు, సమావేశాలు, ర్యాలీలకు హాజరు కావొద్దని స్పష్టం చేసింది. మీడియాకు దూరంగా ఉండాలని ఆదేశించింది. ఈ సాయంత్రం నుంచి ఆంక్షలు అమల్లోకి వస్తాయని తెలిపింది. అదీ ముగిసిందో లేదో.. ఇప్పుడు ఐటీ దాడులు చేసింది.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications