విషాదం: నిజామాబాద్ జిల్లా ఆస్పత్రిలో యువ వైద్యురాలు శ్వేత మృతి
నిజామాబాద్: జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో విషాద ఘటన చోట చేసుకుంది. ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో గైనిక్ విభాగంలో పీజీ చేస్తున్న డాక్టర్ శ్వేత అనుమానాస్పాదంగా మృతి చెందింది. ట్రైనింగ్లో భాగంగా గురువారం రాత్రి రెండు గంటల వరకూ డ్యూటీలోనే ఉన్నారు శ్వేత. ఆ తర్వాత తన గదికి వెళ్లి రెస్ట్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, తెల్లవారే సరికి డాక్టర్ శ్వేత విగత జీవిగా కనిపించడం కలకలంగా మారింది.
కరీంనగర్ జిల్లాకు చెందిన శ్వేత గౌనిక్ విభాగంలో పీజీ చేస్తూ నిజామాబాద్ ఆస్పత్రిలో పనిచేస్తున్నారు. గురువారం రాత్రి రెండు గంటల వరకు ఆమె డ్యూటీలోనే ఉన్నారు. అనంతరం తన గదిలో పడుకున్నారు. శుక్రవారం ఉదయం చూసేసరికి ఆమె మృతి చెందారు. ఆమె గుండెపోటుతోనే మృతి చెందినట్లు చెబుతున్నారు.

గుండెపోటుతోనే మరణించారా? లేక మరేదైనా కారణం ఉందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. శుక్రవారం ఆమె మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. కాగా, అప్పటి వరకు తమతోపాటు కలిసి పనిచేసిన వైద్యురాలు హఠాన్మరణంతో తోటి జూనియర్ వైద్యులు విషాదంలో మునిగిపోయారు.
నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రతిమా రాజ్ మాట్లాడుతూ.. డాక్టర్ శ్వేత చాలా చలాకీగా ఉండేవారని, ఆమెలో ఎప్పుడు కూడా డిప్రెషన్ వంటివి చూడలేదని అన్నారు. శ్వేత మరణం చాలా బాధాకరమని అన్నారు. డాక్టర్ శ్వేత అంతకుముందు రోజు రాత్రి స్నేహితులకు జ్యూస్ పార్టీ కూడా ఇచ్చిందని, అంతలోనే ఆమె మరణించడం విచారకరమని అన్నారు. శ్వేత మృతి చెందిందన్న వార్తతో ఆమె కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
-
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..? -
మళ్ళీ లాక్డౌన్? కేంద్రం సంచలన ప్రకటన -
వచ్చే మూడు నెలలు హై అలర్ట్, ఏపీలో ఎండల ముప్పు











Click it and Unblock the Notifications