అమానుషం: కాలితో తన్నిన తహసీల్దార్, టిప్పర్ కింద పడి యాచకుడు మృతి
నిజామాబాద్: జిల్లాలోని ఆర్మూరు పట్టణంలో ఓ డిప్యూటీ తహసీల్దార్ అమానుషంగా ప్రవర్తించడంతో ఓ యాచకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఆర్మూర్లోని ట్రాఫిక్ సిగ్నల్ వద్ద టిప్పర్ ఢీకొని నిజాంసాగర్ కెనాల్ ప్రాంతానికి చెందిన శివరాం అనే యాచకుడు దుర్మరణం పాలయ్యాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లి సిగ్నల్ వద్ద ఆగిన కార్ల అద్దాలు తుడుస్తూ.. డబ్బులు యాచిస్తూ శివరాం అనే వ్యక్తి తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 22న సాయంత్రం సిగ్నల్ వద్దకు వచ్చిన మెండోరా మండల డిప్యూటీ తహశీల్దార్ రాజశేఖర్ కారు ఆగింది. అదే సమయంలో శివరాం రోజూ చేసే పనిలో భాగంగా డిప్యూటీ తహశీల్దార్ కారు అద్దాలను క్లీన్ చేశాడు.

అనంతరం డబ్బులు ఇవ్వాలని తహసీల్దార్ను కోరాడు. అయితే.. రాజశేఖర్ మాత్రం డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించాడు. ఇంతలోనే సిగ్నల్ పడటంతో రాజశేఖర్ తన కారును ముందుకు పోనిచ్చాడు. అయితే, డబ్బులు ఇస్తాడేమో అన్న ఆశతో కారు వెంటే శివరాం పరుగులు తీశాడు. అది చూసి తీవ్ర అసహాసనానికి గురైన రాజశేఖర్.. కారు ఆపి మరీ, శివరాంను కాలితో తన్నాడు. దీంతో అదుపు తప్పిన శివరాం.. తూలుతూ వెళ్లి రోడ్డుపై పడ్డాడు. అదే సమయంలో అటుగా వచ్చిన టిప్పర్ శివరాం పైనుంచి వెళ్లడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
ఈ సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి వచ్చి పరిశీలించారు. అక్కడే ఉన్న సీసీటీవీ దృశ్యాల ఆధారంగా కేసు నమోదు చేశారు. మెండోరా డిప్యూటీ తహశీల్దార్ అమానుష చర్య బయటపడటంతో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. డబ్బులు అడిగి ఇవ్వాలి లేదంటే వెళ్లిపోవాలి కానీ.. ఇలా ప్రాణాలు తీస్తారా? అని స్థానికులు మండిపడుతున్నారు. శివరాం కుటుంబానికి న్యాయం చేయాలని ఆందోళన చేపట్టారు. దీంతో వారికి పోలీసులు సర్ది చెప్పి శాంతింపజేశారు.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications