Accident: నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి..
అతి వేగం ప్రమాదకరమని తెలిసినా.. పట్టించుకోవడం లేదు. ప్రాణాలు పోతాయనే భయం లేకుండా వాహనాలు నడుపుతున్నారు. తాజాగా నిజామాబాద్ పట్టణ శివారులోని అర్సపల్లి బైపాస్రోడ్డు లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. నిజామాబాద్ నుంచి గురువారం సాయంత్రం రెంజల్ మండలం దూపల్లి వెళ్తున్న ఆటోను ఎదురుగా వచ్చిన ఆశోక్ లే ల్యాండ్ వాహనం ఢీ కొట్టింది.
ఈ ప్రమాదంలో ఐదుగురు గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించారు. అయితే వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. భవన నిర్మాణ పనులకు వెళ్లిన కూలీలు ఆటోలో ఉన్నట్లు సమాచారం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.మృతి చెందిన వ్యక్తులు, గాయపడిన వారు బోధన్ మండలం ఊట్పల్లి గ్రామానికి చెందిన వాసులుగా గుర్తించారు. ప్రమాద సమయంలో ఆటోలో 8 మంది ప్రయాణిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే ఆశోక్ లే ల్యాడ్ డ్రైవర్ పరారయ్యాడు. ఈ ప్రమాదానికి అతివేగమే కారణమని తెలుస్తోంది.

ఏపీలో జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం జె.కొత్తూరుకు చెందిన మానేపల్లి రాజకుమార్, కిర్లంపూడి మండలం సోమవరానికి చెందిన మలిరెడ్డి దుర్గాభవానికి మే 10న వివాహం చేయాలని పెద్దలు నిర్ణయించారు. ఇటీవలే నిశ్చితార్థం కూడా ఘనంగా నిర్వహించారు. గత మంగళవారం వారిద్దరూ కలిసి తూర్పుగోదావరి జిల్లా గౌరీపట్నం మేరీమాత ఆలయానికి ద్విచక్ర వాహనంపై వెళ్లారు.
మార్గమధ్యంలో వెనుక నుంచి వచ్చిన ఓ లారీ వారిని ఢీకొట్టడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలను పోలీసులు రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 15 రోజుల్లో పెళ్లి ఉండగా.. కాబోయే పెళ్లి జంట మృతి చెందడం స్థానికంగా విషాదం నెలకొంది.
-
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు!












Click it and Unblock the Notifications