బోటు మృతుల కుటుంబాలకు అదనంగా పదిలక్షలు..,
గోదావరిలో జరిగిన బోటు ప్రమాద ఘటనలో మృతుల కుటుంబాలకు అదనంగా పది లక్షల రుపాయాలు అందించనున్నట్టు తూర్పుగోదావరి జిల్లా పోలీసు అధికారులు ప్రకటించారు. ఇవి ప్రభుత్వ సహాయానికి అదనంగా అందివ్వనున్నట్టు జిల్లా ఎస్పీ నయీం అస్మి తెలిపారు. అదనపు డబ్బులను బీమా సహయం ద్వార అందించనున్నట్టు ఆయన చెప్పారు. ఇందుకోసం న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా చెల్లింపులు జరుగుతాయన్నారు. దీనికోసం రాజమహేంద్రవరం ఎస్పీ కార్యాలయం వద్ద బీమా సహాయకేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు ఆయన చెప్పారు.
కాగా ప్రమాద సంఘటనపై సమీక్ష జరిపిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బాధిత కుటుంబాలకు 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారికి మూడు లక్షల రుపాయాలతోపాటు ప్రమాదం బయటపడిన వారికి లక్ష రూపాలయను ప్రకటించారు. దీంతో పాటు బాధితకుటుంబాలకు అండగా ఉంటామని హమీ ఇచ్చారు. మరోవైపు మృతుల్లో వరంగల్, హైదారబాద్ ప్రాంతానికి చెందిన వారు ఉండడంతో తెలంగాణ ప్రభుత్వం కూడ స్పందించింది. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరుపున 5 రూపాయల ఎక్స్గ్రేషియాను ప్రకటించింది.

ప్రమాద సమయంలో బోటులో 8 మంది సిబ్బందితోపాటు ముగ్గురు పిల్లలతో సహా మొత్తం 75 మంది ఉన్నారని పోలీసులు చెప్పారు. వీరిలో 26 మంది ప్రాణాలతో బయటపడగా.. 34 మృతదేహాలను బయటకు తీశారు. మరో 15 మంది ఆచూకీ తెలియలేదు. బోటులోనే వారి డెడ్బాడీలు చిక్కుకొని ఉంటాయని అంచనా వేస్తున్నారు.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications