రాయల్స్ వర్సెస్ సూపర్ కింగ్స్: రెండో విక్టరీపై చెన్నై కన్ను..
ఐపీఎల్ 2020లో చెన్నై సూపర్ కింగ్స్ విక్టరీ కొట్టిన సంగతి తెలిసిందే. ముంబై ఇండియన్స్ను మట్టి కరిపించి.. సీజన్లో తొలి విజయం నమోదు చేసుకుంది. అయితే ఇవాళ రాజస్తాన్ రాయల్స్తో తలపడుతోంది. వరసగా రెండో విజయం సాధించి.. తన దూకుడు కొనసాగించాలని భావిస్తోంది. ధోనీ సేన.. స్టివ్ స్మిత్ అండ్ టీం మధ్య పోరులో ఎవరూ పై చేయి సాధస్తారంటే మరికొద్ది గంటలు ఆగాల్సిందే.
టీ20 ఫార్మాట్కు సరిపోయే కాంబినేషన్స్ అన్నీ రాజస్థాన్ జట్టులో ఉన్నాయి. జోస్ బట్లర్, స్మిత్, డేవిడ్ మిల్లర్లాంటి విదేశీ క్రికెటర్లపైనే బ్యాటింగ్ బలం ఆధారపడి ఉంది. ప్రస్తుతం బట్లర్ ఫామ్లో ఉండటం కలిసొచ్చే అంశం. స్మిత్, మిల్లర్ కుదురుకుంటే జట్టు బ్యాటింగ్కు డోకా లేదు.ఇంగ్లండ్ ఆల్రౌండర్ బెన్ స్టోక్స్.. జట్టుకు కొండంత అండ. బౌలింగ్లో ఆర్చర్, జైదేవ్ ఉనాద్కట్, వరుణ్ ఆరోన్, టై, కరన్తో పేస్ బలగం బలంగా ఉంది. శ్రేయస్ గోపాల్, రాహుల్ తెవాటియా స్పిన్ మ్యాజిక్ పని చేస్తే తిరుగుండదు. మిస్టరీ స్పిన్నర్ మయాంక్ మార్కండే అదనపు బలం కానుంది.
అయితే చెన్నై జట్టును ఏ మాత్రం తక్కువ అంచనా వేయలేం. టీం.. బ్యాటింగ్, బౌలింగ్.. కాదు ఫీల్డింగ్ కూడా పకడ్బందీగా ఉంది. ఫస్ట్ మ్యాచ్లో ముంబై పేలవ ఫీల్డింగ్, క్యాచ్లు మిస్ చేయడం చెన్నైకి కలిసి వచ్చిందనే చెప్పాలి. ఇక అంబటి రాయుడు విజృంభణతో.. ఆ జట్టు విజయం ఈజీగా మారింది. మరీ రెండో మ్యాచ్లోనూ రాయుడు, డుప్లెసిస్.. దంచి కొడితే.. రాజస్తాన్ రాయల్స్ దాసోహం అనాల్సిందేనని క్రికెట్ పండితులు అభిప్రాయపడుతున్నారు.