అచ్చెన్నాయుడిపై ప్రభుత్వం కక్ష: విచారణ అధికారిపై మావన హక్కుల ఉల్లంఘనలు, హైకోర్టులో ఫైన్...
మాజీమంత్రి అచ్చెన్నాయుడిపై ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని టీడీపీ విమర్శిస్తోంది. దీనికి బలం చేకూర్చేలా ఏసీబీ అధికారులు కూడా వ్యవహరిస్తున్నారు. ఈఎస్ఐ స్కాంలో 3 రోజుల ఏసీబీ కస్టడీకి కోర్టు అనుమతించింది. అయితే దర్యాప్తు అధికారి గురించి కొన్ని విషయాలు వెలుగుచూశాయి. ఆయన ఇదివరకు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి పట్ల దురుసుగా ప్రవర్తించిన దాఖలాలు ఉన్నాయి. దీంతో ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని.. దీనికి సాక్షాలివే అని టీడీపీ నేతలు అంటున్నారు.

మానవ హక్కుల ఉల్లంఘన
అచ్చెన్నాయుడిని విచారిస్తున్న అధికారికి గతంలో ట్రాక్ రికార్డు సరిగా లేదు. మానవ హక్కులు ఉల్లంఘించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇందుకు ఒకసారి హైకోర్టు జరిమానా కూడా విధించింది. అలాంటి అధికారిని ఈఎస్ఐ స్కాంలో మాజీమంత్రిని విచారించేందుకు వేయడం వెనక ఆంతర్యం ఏంటి అని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇదీ ముమ్మాటికీ ప్రభుత్వ కుట్ర అని మండిపడుతున్నారు.

విచారణ అధికారి...?
ఈఎస్ఐ స్కాంలో అచ్చెన్నాయుడిని విచారించేందుకు ఏసీబీకి కోర్టు మూడురోజుల గడవు ఇచ్చింది. దీంతో గుంటూరు జీజీహెచ్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేయాలని ఏసీబీ అధికారులు ఒత్తిడి తీసుకొచ్చారు. జైలుకు తీసుకెళ్లి విచారించాలని అనుకొన్నారు. కానీ టీడీపీ నేతల ఆందోళనలతో వెనక్కి తగ్గారు. ఆస్పత్రిలోనే విచారిస్తున్నారు. కానీ విచారణ అధికారి నియామకం మాత్రం విమర్శలకు దారితీస్తోంది.

వాహనంలో 500 కి.మీ ప్రయాణం
అచ్చెన్నాయుడిని శ్రీకాకుళం జిల్లా నుంచి విజయవాడ వరకు 500 కిలోమీటర్లు వాహనంలో తీసుకొచ్చారని అందువల్లే గాయం తిరగబెట్టిందని టీడీపీ నేతలు ఆరోపించారు. రక్తస్రావం కావడంతో మరోసారి శస్త్రచికిత్స చేయాల్సి వచ్చిందని చెబుతున్నారు. ఇప్పుడు డిశ్చార్జ్ పేరుతో డ్రామాలు, విచారణ అధికారి గురించి టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.
Recommended Video

రూ.150 కోట్ల స్కాం
నిబంధనలు ఉల్లంఘించి టెలీ హెల్త్ సర్వీస్కు కాంట్రాక్ట్ ఇచ్చారని ఆరోపణలు వచ్చాయి. దీంతో రూ.150 కోట్ల కుంభకోణం జరిగిందని ఏసీబీ వాదిస్తోంది. అప్పటి కార్మికశాఖ మంత్రి అచ్చెన్నాయుడి ప్రమేయంతోనే కుంభకోణం జరిగిందని, అభియోగం మోపింది. ఇటీవల అచ్చెన్నాయుడిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన రిమాండ్లో ఉన్నారు. అనారోగ్యం వల్ల జీజీహెచ్లో చికిత్స తీసుకుంటున్నారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications