అమ్మాయిని గ్యాంగ్ రేప్ చేసి, శీలానికి వెల కట్టారు
మహబూబ్ నగర్: పాలమూరు జిల్లా బాలానగర్ మండలంలోని ఓ తండాలో గిరిజన బాలిక పైన సామూహిక అత్యాచారం జరిగింది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పదో తరగతి చదువుతున్న విద్యార్థిని పైన ఓ యువకుడు మిత్రులతో కలిసి అయిదు రోజుల కిందట గ్యాంగ్ రేప్కు పాల్పడ్డాడని తెలుస్తోంది.
ఆ రోజు రాత్రి ఎవరు లేని ప్రదేశానికి తీసుకు వెళ్లిన యువకుడు అత్యాచారం చేశాడు. ఆ తర్వాత తన మిత్రులను ఉసిగొల్పాడు. ఆ బాలిక స్పృహ తప్పి పడిపోయింది. బాలిక చనిపోయిందని భావించి పొలాల్లోని ఓ చెట్టుకు కట్టేసి వెళ్లిపోయారు.

బయటకు వెళ్లిన ఆ అమ్మాయి ఎంతకు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతికారు. అర్ధరాత్రి ఎవరులేని ప్రాంతంలో చెట్టుకు కట్టేసి కనిపించింది. ఈ దారుణంపై అందరు గప్ చుప్ అయ్యారని సమాచారం. బాలిక తల్లిదండ్రులను ఒప్పించి బాలిక శీలానికి లక్ష రూపాయలు ఇస్తామని పెద్దలు రాజీ కుదిర్చినట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications