సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావుకు 14 రోజుల రిమాండ్: రిపోర్టులో సంచలన విషయాలు
హైదరాబాద్: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయిన హైదరాబాద్ సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావుకు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ మేరకు ఆయనను పోలీసులు బుధవారం చంచల్గూడకు తరలించారు. మంగళవారం తెల్లవారుజాము నుంచి ఏకకాలంలో ఏసీపీ నివాసంతోపాటు 14 చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. రూ.3 కోట్లకు పైగా ఆస్తులను గుర్తించారు.
ఉమామహేశ్వరరావు నివాసంలో రూ.38 లక్షల నగదు, 60 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం ఆస్తుల మార్కెట్ విలువ రూ. 40 కోట్లకుపైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఎలక్ట్రానిక్ వస్తువులు, డైరీల్లో సందీప్ అనే పేరును గుర్తించారు. ఇద్దరు కలిసి ఏమైనా ఆర్థిక లావాదేవీలు సాగించారా? అనే కోణంలో వివరాలు సేకరిస్తున్నారు.

హైదరాబాద్ సహా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ 17 ప్రాంతాల్లో స్థిరాస్తులను అధికారులు గుర్తించారు. ఆ తర్వాత ఉమామహేశ్వరరావు అరెస్టు చేశారు. ఆ తర్వాత తాజాగా, బుధవారం ఆయనను నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. దీంతో న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. ఈ క్రమంలో ఉమామహేశ్వరరావును చంచల్గూడ జైలుకు తరలించారు.
భారీగా ఆస్తులు: రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు
మరోవైపు, రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగుచూశాయి.అశోక్ నగర్లో 205, 504 ఫ్లాట్స్లో సోదాలు నిర్వహించామని రిమాండ్ రిపోర్టులో, బర్కత్పురాలో డీఎస్పీ సందీప్ రెడ్డి నివాసంలో కూడా సోదాలు జరిపారు. ఇక, కాప్రాలోని ఏసీపీ స్నేహితుడు నరేంద్ర బాబు నివాసంలోనూ దాడులు చేశారు. సికింద్రాబాద్లో నీలిమా నివాసం, అనకాపల్లిలో బంధువు మహాలక్ష్మి, విశాఖపట్టణంలోని బంధువుల ఇళ్లల్లోనూ సోదాలు నిర్వహించారు.
ఈ సోదాల్లో నగదు రూ.38 లక్షలు, బంగారం 60 తులాలకుపైగా స్వాధీనం చేసుకున్నారు. షామీర్ పేట్లో రూ.80 లక్షలు విలువైన ఎకరం భూమి, 333 గజాల విల్లాను గుర్తించారు. జవహర్ నగర్లో 3 గుంటలు, ఘట్కేసర్లో 4 ప్లాట్లు, శామీర్పేట్లో 14 గుంటల బినామీ భూమి, అశోక్ నగర్లో ఉన్న అపార్టుమెంట్లో 3 ఫ్లాట్లను, కూకట్పల్లిలో 200 గజాల ఫ్లాట్ను గుర్తించారు.
మరోవైపు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్టణంలో 25 సెంట్ల భూమి, చోడవరంలో 5.92 ఎకరాలు, 240 గజాల ప్లాట్, దొండపూడిలో 2.20 ఎకరాల బినామా ఆస్తులపై దర్యాప్తు కొనసాగుతోంది. ఆర్ఎస్ కన్ట్రక్షన్లో విలా కొనుగోలు కోసం ఉమామహేశ్వరరావు రూ.50 లక్షల పెట్టుబడి పెట్టారు. ఈ కేసులో పోలీసులు సమగ్ర దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
-
మూసీ తీరాన మహత్తరం -
తెలంగాణాకు వరుణ సందేశం.. ఈ జిల్లాలలో వర్షాలు.. ఎల్లో అలెర్ట్! -
పేద విద్యార్దుల చదువు కోసం మంచు లక్ష్మీ ఇంత చేస్తున్నారా..? -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా












Click it and Unblock the Notifications