15 సెకండ్లు కాదు.. గంట తీసుకోండి: నవనీత్కు అసదుద్దీన్ ఒవైసీ కౌంటర్
హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో రాజకీయ పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో బీజేపీ, ఎంఐఎం నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇరు పార్టీల నాయకులు ఒకరిపై ఒకరు తీవ్రమైన విమర్శలు చేసుకుంటున్నారు.
తాజాగా ఒకప్పటి టాలీవుడ్ నటి నవనీత్ రవి రాణా చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. మహారాష్ట్రలోని అమరావతి ఎంపీగా ఉన్న నవనీత్.. హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతకు మద్దతుగా నగరంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. యువ మోర్చా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఒవైసీపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

15 నిమిషాలు పోలీసులు లేకుండా ఉంటే మా తడాఖా ఏమిటో చూపిస్తామని గతంలో ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. 'మాకు 15 సెకన్లు చాలు' అంటూ నవనీత్ కౌంటర్ ఇచ్చారు. 'పోలీసులను 15 నిమిషాలు తప్పుకోమనండి, మేము ఏమి చేయగలమో చూపిస్తామని అసదుద్దీన్ తమ్ముడు చెప్పాడు. మీకు 15 నిమిషాలు పట్టొచ్చేమో, కానీ మాకు 15 సెకన్లే చాలని నేను అతడితో చెప్పాలనుకుంటున్నా. ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీలకు ఓటు వేస్తే పాకిస్థాన్కు వేసినట్టే' అని నవనీత్ రవి రాణా వ్యాఖ్యానించారు.
15 सेकंद लगेगा @AkbarOwaisi_MIM @asadowaisi pic.twitter.com/TfEmWhvArX
— Navnit Ravi Rana (Modi Ka Parivar) (@navneetravirana) May 8, 2024
అంతేగాక, 39 సెకన్ల ఈ వీడియోను తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసి అక్బరుద్దీన్ ఒవైసీకి కు ట్యాగ్ చేశారు. ఈ నేపథ్యంలో నవనీత్ రవి రాణా వ్యాఖ్యలపై ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. 'మీరు చెప్పినట్టే కానీయండి' అంటూ సవాల్ విసిరారు.
Aap 15 Second mein kya karenge? Kaun Darr raha hai aapse? Aap Ikhlaq, Pehlu khan, Rakbar aur Mukhtar Ansari jaisa haal karenge? Hum tayyar hain
— Asaduddin Owaisi (@asadowaisi) May 9, 2024
pic.twitter.com/lQqMDBJht3
'నేను ప్రధాని మోడీజీకి చెబుతున్నాను. ఆమెకు 15 సెకన్లు ఇవ్వండి. ఆమె ఏమి చేస్తుందో చేయనీయండి. అవసరమైతే ఆమెకు ఒక గంట సమయం ఇవ్వండి. వారు ఏమి చేస్తారో మేము చూడాలనుకుంటున్నాం. వారిలో మానవత్వం మిగిలి ఉందా? ఎవరు భయపడతారు? మేం సిద్ధంగా ఉన్నాం.. ఎవరైనా ఓపెన్ కాల్ చేస్తే (ఇలా) అలాగే ఉంటాం. మీరు అనుకున్నది చేయండి. ఎక్కడికి రమ్మంటారో చెప్పండి. మిమ్మల్ని ఆపేదెవరు?' అని మీడియాతో ఒవైసీ అన్నారు. మరోవైపు, ప్రధాని మోడీపైనా విమర్శలు చేశారు.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో












Click it and Unblock the Notifications