19 మందికి కరోనా వైరస్, బామ్మ అంత్యక్రియల్లో పాల్గొనడంతో.. క్వారంటైన్కు
కరోనా వైరస్ చాపకింద నీరులా పాకుతోంది. నగరం, పట్టణం నుంచి పల్లెలకు కూడా వైరస్ కనిపిస్తోంది. ఇటీవల సంగారెడ్డి జిల్లాలో ఓ వృద్దురాలు చనిపోయారు. అయితే సాధారణంగా చనిపోయారని అనుకొన్నారు. అంత్యక్రియలు నిర్వహించే ముందు.. రక్త నమూనాలను సేకరించారు. ఆమెకు కరోనా వైరస్ సోకిందని తేలింది. దీంతో కుటంబసభ్యులు ఉలిక్కిపడ్డారు.
జహీరాబాద్ శాంతినగర్లో ఓ వృద్దురాలు చనిపోయారు. ఎందుకైనా మంచిదని పరీక్షలు చేయగా.. కరోనా పాజిటివ్ వచ్చింది. తర్వాత అంత్యక్రియల్లో పాల్గొన్న బంధువులకు పరీక్షలు చేశారు. ఇలా 19 మందికి వైరస్ సోకింది. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. వారు ఎవరితో కలిశారు.. ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్లపై అధికారులు ఆరా తీస్తున్నారు.
మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్లో లాక్ డౌన్ మళ్లీ విధించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ సంకేతాలు కూడా ఇచ్చారు. సోమవారం మీడియా ముందుకు సీఎం కేసీఆర్ వచ్చే అవకాశం ఉంది. హైదరాబాద్ లేదంటే రాష్ట్రవ్యాప్తంగా లాక్ డౌన్పై ప్రకటించే అవకాశం ఉంది. జగిత్యాల జిల్లాలో ముంబై నుంచి వచ్చిన వలసకూలీలతో పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి.