19 మందికి కరోనా వైరస్, బామ్మ అంత్యక్రియల్లో పాల్గొనడంతో.. క్వారంటైన్కు
కరోనా వైరస్ చాపకింద నీరులా పాకుతోంది. నగరం, పట్టణం నుంచి పల్లెలకు కూడా వైరస్ కనిపిస్తోంది. ఇటీవల సంగారెడ్డి జిల్లాలో ఓ వృద్దురాలు చనిపోయారు. అయితే సాధారణంగా చనిపోయారని అనుకొన్నారు. అంత్యక్రియలు నిర్వహించే ముందు.. రక్త నమూనాలను సేకరించారు. ఆమెకు కరోనా వైరస్ సోకిందని తేలింది. దీంతో కుటంబసభ్యులు ఉలిక్కిపడ్డారు.
జహీరాబాద్ శాంతినగర్లో ఓ వృద్దురాలు చనిపోయారు. ఎందుకైనా మంచిదని పరీక్షలు చేయగా.. కరోనా పాజిటివ్ వచ్చింది. తర్వాత అంత్యక్రియల్లో పాల్గొన్న బంధువులకు పరీక్షలు చేశారు. ఇలా 19 మందికి వైరస్ సోకింది. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. వారు ఎవరితో కలిశారు.. ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్లపై అధికారులు ఆరా తీస్తున్నారు.

మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్లో లాక్ డౌన్ మళ్లీ విధించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ సంకేతాలు కూడా ఇచ్చారు. సోమవారం మీడియా ముందుకు సీఎం కేసీఆర్ వచ్చే అవకాశం ఉంది. హైదరాబాద్ లేదంటే రాష్ట్రవ్యాప్తంగా లాక్ డౌన్పై ప్రకటించే అవకాశం ఉంది. జగిత్యాల జిల్లాలో ముంబై నుంచి వచ్చిన వలసకూలీలతో పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications