హైదరాబాద్ కేంద్రంగా భారీగా హవాలా సొమ్ము.. 3.5 కోట్లు సీజ్; ఆరుగురు అరెస్ట్!!
హైదరాబాద్ లోని గాంధీ నగర్ లో భారీగా హవాలా డబ్బును టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. 3.5 కోట్ల రూపాయల నగదును రెండు కార్లలో అక్రమంగా తరలిస్తున్న క్రమంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హవాలా నగదును తరలిస్తున్న ఆరుగురిని అరెస్టు చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు వారిని గాంధీనగర్ పోలీస్ స్టేషన్లో అప్పగించారు.

మారియట్ హోటల్ నుండి 3.5 కోట్ల హవాలా డబ్బు తరలింపు యత్నం
మారియట్ హోటల్ కేంద్రంగా భారీగా హవాలా నగదు తరలిస్తున్నట్లు నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్, మరియు గాంధీనగర్ పోలీసులకు వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు మారియట్ హోటల్ దగ్గర పోలీసులు తనిఖీలు నిర్వహించగా, రెండు కార్లలో అక్రమంగా తరలిస్తున్న 3.5 కోట్ల లెక్కల్లో చూపని నగదు పట్టుబడింది. కర్మన్ ఘాట్ న్యూ బాలాజీ నగర్ కు చెందిన గంటా సాయి కుమార్ రెడ్డికి, కె వెంకటేశ్వరరావు అనే వ్యక్తి 3.5 కోట్ల నగదు ఇచ్చి సైదాబాద్ లో ఉండే బాలు మహేందర్ కు అందజేయాలని సూచించాడు.

పట్టుకున్న టాస్క్ ఫోర్స్ .. ఆరుగురు అరెస్ట్
దీంతో సాయి కుమార్ రెడ్డి తన స్నేహితులైన మహేష్, సందీప్ కుమార్, మహేందర్, అనుష్ రెడ్డి, భరత్ తో కలిసి రెండు కార్లలో నగదును తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. అయితే ఈ సొమ్ముకు సరైన ఆధారాలు చూపించక పోవడంతో పోలీసులు హవాలా కోణంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే హైదరాబాద్ నగరంలో గత కొన్ని రోజులుగా పలు చోట్ల భారీగా నగదు పట్టుబడుతున్న తీరు కలకలం గా మారింది .

గతంలోనూ భారీగా పట్టుబడిన హవాలా నగదు.. టాస్క్ ఫోర్స్ ప్రత్యేక నిఘా
గతంలో కూడా 2.49 కోట్ల నగదును పట్టుకున్న పోలీసులు ముగ్గురుని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. కొద్ది రోజుల క్రితం జూబ్లీహిల్స్ లో 2.49 కోట్ల హవాలా డబ్బును వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అదుపులోకి తీసుకున్న ముగ్గురు నిందితులను బెంగళూరుకు చెందిన బోయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ లో పనిచేస్తున్న సిబ్బంది గా గుర్తించారు. అంతకుముందు చాంద్రాయణగుట్ట పోలీసులు కూడా 79 లక్షల నగదును స్వాధీనం చేసుకుని నలుగురిని అరెస్టు చేశారు. వరుస ఉదంతాలతో హైదరాబాద్ లో హవాలా సొమ్ము పై టాస్క్ ఫోర్స్ పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు!












Click it and Unblock the Notifications