4నెలల బాబు కిడ్నాప్: ప్రియుడికి పండుగ గిఫ్ట్గా ఇచ్చిన యువతి
హైదరాబాద్: నగరంలోని భవానీనగర్లో దారుణం చోటు చేసుకుంది. ప్రియుడి కోసం చిన్నారిని కిడ్నాప్ చేసిన ఓ మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కథనం ప్రకారం జీహెచ్ఎంసీలో కాంట్రాక్ట్ లీడర్గా పనిచేస్తున్న భాగ్య ప్రియుడి కోసం నాలుగు నెలల బాబును కిడ్నాప్ చేసింది.
మంజులత, సచిన్ అనే దంపతులు కూలీ పనులు చేసుకునేవారు. ఈ నెల 5వ తేదీన కూలీ పనులు ముగించుకుని ఈనెల భవానీ నగర్లో ఉన్న బ్రిడ్జి కింద పడుకున్నారు. దంపుతులిద్దరూ బాగా నిద్రమత్తులో ఉన్నప్పుడు భాగ్య వచ్చి బాబు మహేష్ను ఎత్తుకుపోయింది.
బాబును తన ప్రియుడు నరసింహాకు అప్పజెప్పింది. నరసింహాకు పిల్లలు లేకపోవడంతో పండగ సందర్భంలో ప్రియుడికి గిఫ్ట్ ఇవ్వడానికి కిడ్నాప్ చేసినట్లు పోలీసుల విచారణలో నిందితురాలు భాగ్య వెల్లడించింది. బాబు తల్లిదండ్రుల ఫిర్యాదులో ఈ కిడ్నాప్ కేసు వెలుగులోకి వచ్చింది.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులు భాగ్య, నరసింహాను అదుపులోకి తీసుకున్నారు.